మెదక్ అర్బన్, మే18 : ప్రజావాణిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రజావాణి రాష్ట్ర ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాకేశ్రెడ్డి కోరారు. మెదక్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రజావాణి కోసం అదనంగా కేంద్రాలు ఏర్పాటుచేసి కొన్నిమార్పులు చేయాలన్నారు. ప్రతి దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించాలన్నారు.
దరఖాస్తుదారుడికి తప్పకుండా రసీదు అందజేయాలని సూచించారు. సమస్య పరిష్కరించేందుకు అధికారులు పారదర్శకంగా పనిచేయాలన్నారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు. అర్జీదారుల నుంచి 101 దరఖాస్తులు స్వీకరించామన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, డీఆర్డీవో శ్రీనివాస్రావు పాల్గొన్నారు.