అక్కన్నపేట/ హుస్నాబాద్రూరల్, జనవరి 29: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ కింద అక్కన్నపేట, రేగొండ , జనగామ గ్రామాల్లో రూ. 85 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకులు, గండిపల్లిలో రూ. 22లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన, అంతకపేటలో రూ.15 లక్షలతో నిర్మించిన మహి ళా భవనం, రూ.5 లక్షలతో చేపట్టిన ఓపెన్ జిమ్ సెంటర్ను ప్రారంభించి, రూ. 1.50 కోట్లతో అంతకపేట-గుబ్బడి బీటీ రోడ్డు పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశా రు.
హుస్నాబాద్ మండలంలోని పందిల్లలో రూ. 22 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన, రాములపల్లి, వంగరామయ్యపల్లిలో రూ. 40 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలు, రూ. 47 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకులను ఆయన ప్రారంభించారు.కార్యక్రమాల్లో సిద్దిపేట జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, హుస్నాబాద్ ఆర్డీవో బెన్షాలోమ్, ఎంపీపీలు మాలోతు లక్ష్మీబీలునాయక్, లకావత్ మానస, జడ్పీటీసీ భూక్యా మంగ, సర్పంచ్లు సంజీవరెడ్డి, సృజనసంపత్, లావణ్య, మానస, నిర్మల, రమేశ్, మధన్మోహన్, విజయలక్ష్మి పాల్గొన్నారు.