రామచంద్రాపు రం, జూన్ 11: డిజిటల్ అరెస్ట్ స్కా మ్లో సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్సింగ్, మరో వ్యక్తి నారాయణ్సింగ్ చౌదరిని బెంగళూరు సౌత్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలోకి వెళ్తే..నిందితులిద్దరు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ మంజునాథ్ అనే వ్యక్తి, అతని భార్యకు ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డు గడువు ముగిసిపోయిందని, బ్యాంకు ఖాతాలు సీబీఐ, ఈడీలలో నమోదైన మనీ లాండరింగ్ కేసులతో ముడిపడి ఉన్నాయని, ఇద్దరిని తీహార్ జైలులో పెడతామని బెదిరించారు.
నైజీరియాలో ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఈ జంట ఉద్యోగ విరమణ చేశారు. వారి ఖాతా నుంచి నిందితుల ఖాతాలకు రూ.4.79 కోట్లు బదిలీ చేయించారు. నిందితులు వారిని మూడు నెలలుగా హింసించి డిజిటల్ అరెస్ట్లో ఉంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆ జంట తమ ఆస్తి పత్రాలను కూడా ఇద్దరు నిందితులకు ఇచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు ఉనప్పటికీ వారికి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. నెఫ్ట్, ఆర్టీజీస్ ద్వారా డబ్బులు పంపించారు.
ఆ తర్వాత బాధితులు స్కామ్లో చిక్కుకున్నామని గ్రహించి సౌత్ ఈస్ట్రన్ డివిజన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఆర్సీపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్సింగ్ ఖాతాకు రూ.10లక్షలు, నారాయణ్సింగ్ చౌదరి ఖాతాకు రూ.1.80 కోట్లు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు శ్రీలంకలో క్యాసినో జూదం ఆడటానికి ఈ డబ్బు ఉపయోగించారని తేలింది. నిందితులు ఇద్దరు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. క్రైమ్కి సంబంధించిన వార్తను బెంగళూరు పబ్లిక్ టీవీ ఇంగ్లిష్ మీడియా ప్రచురించగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.