మెదక్ అర్బన్, ఫిబ్రవరి 6 : రాజీ చేసుకునే కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. సోమవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించే లోక్అదాలత్ కార్యక్రమం పై న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. కక్షిదారులు రాజీ పడే కేసులను లోక్అదాలత్లో పరిష్కరించుకోవాలని, లోక్ అదాలత్ లో ఇచ్చే తీర్పు తుదితీర్పుగా ఉంటుందన్నారు. కంపౌండబుల్, బ్యాంక్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులను రాజీ చేసుకునేవారు లోక్ అదాలత్ను ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జితేందర్, జూనియర్ సివిల్ న్యాయమూర్తి రీటాలాల్చంద్, స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి కల్పన, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి కలిసిన కలెక్టర్ రాజర్షి షా
జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారదను ఆమె చాంబర్లో కలెక్టర్ రాజర్షిషా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్కు ప్రధాన న్యాయమూర్తి శుభాకాంక్షలు తెలిపారు.
లోక్ అదాలత్ను సద్వినియోగపర్చుకోవాలి
నర్సాపూర్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి అనిత
నర్సాపూర్, ఫిబ్రవరి 6 : లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి అనిత పేర్కొన్నారు. ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకొని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నర్సాపూర్ కోర్డ్టు ఆవరణంలో లోక్ అదాలత్ నిర్వహణపై పోలీసులు, బ్యాంక్ మేనేజర్లతోపాటు ఇతక అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి అనిత మాట్లాడుతూ..
కక్షిదారులు లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకోవాలన్నారు. లోక్అదాలత్లో కేసులను రాజీ కుదుర్చుకుని సమయాన్ని ఆదా చేసుకుని, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కావాలని కక్షిదారులకు సూచించారు. సమావేశంలో ఏసీపీ రాఘవేంద్ర, తూప్రాన్ సీఐ శ్రీధర్, నర్సాపూర్ ఎస్సై గంగరాజు, కౌడిపల్లి ఎస్సై శివప్రసాద్రెడ్డి, శివంపేట్ ఎస్సై రవికాంత్ రావు, ఎక్సైజ్ ఎస్హెచ్వో అరుణ, సీనియర్ న్యాయవాదులు స్వరూపరాణి, ఎస్బీఐ మేనేజర్ సత్యనారాయణ, డిప్యూటీ బ్యాంచ్ మేనేజర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.