చేర్యాల, ఫిబ్రవరి 26 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి లడ్డూ ప్రసాదం ధరలు పెంచు తూ ఇటీవల ఆలయవర్గాలు నిర్ణయం తీసుకున్నా యి. మల్లన్న ఆలయంలో గతంలో 100 గ్రాముల లడ్డూ రూ.20 రూపాయలకు భక్తులకు విక్రయించే వారు. తాజాగా ఆలయవర్గాలు పెంచిన ధర ప్రకారం 100 గ్రాముల లడ్డూ రూ.25గా నిర్ణయించారు.నూతనంగా అభిషేకం లడ్డూల విక్రయాన్ని ప్రవేశపెట్టారు.
ఇక నుంచి భక్తులకు 400 గ్రాముల అభిషేకం లడ్డూ ధర రూ.100కు విక్రయించనున్నారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయంలో పెరిగిన ధరలను ఈ నెల 23వ తేదీ నుంచి అమలులోకి తీసుకొచ్చారు. పెరిగిన సరుకుల ధరలతో పాటు దేవాలయానికి ఆదాయం సమకూర్చేందుకు లడ్డూ ప్రసాదం ధరలు పెంచినట్లు ఆలయవర్గాలు తెలిపాయి.