పటాన్చెరు, ఫిబ్రవరి 9: పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి వీధిని శుభ్రంగా ఉంచాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. రుద్రారంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపూర్ణ పారిశుధ్యంతోనే అంటువ్యాధులను అరికట్టవచ్చని, పంచాయతీ సిబ్బందితో ప్రణాళికాబద్ధంగా పనిచేసి పచ్చదనం పెంచాలని, మొక్కలను సంరక్షించాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి గణేశ్గడ్డ సిద్ధి వినాయక దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం అధికారులు, డీఎల్పీవో సంతోశ్రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్ కలెక్టర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూజారులు కలెక్టర్తో ప్రత్యేక పూజలు చేయించగా, వేదపండితులు ఆశీర్వదించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా కలెక్టర్ గీ తం డీమ్డ్ యూనివర్సిటీని సందర్శించి స్ట్రాం గ్ రూంలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మన్నెరాజు, నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ సుధీర్రెడ్డి, వెంకన్నయాదవ్, ఎంపీవో హరిశంకర్గౌడ్, కార్యదర్శి రాజ్కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
కంది, ఫిబ్రవరి 9: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి పదిలో మెరుగైన ఫలితాలు సాధించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉపాధ్యాయులకు సూచించారు. కందిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధన, భోజనంతో పాటు ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించి, వసతుల గురించి ప్రధానోపాధ్యాయురాలు వెంకటలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి సంధ్యారాణి, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో విశ్వప్రసాద్, ఎంపీఓ మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలని, అందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి రక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కందిలోని పల్లెప్రకృతి వనాన్ని ఆమె సందర్శించారు. పల్లెప్రకృతి వనంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.