సంగారెడ్డి, నవంబర్ 24: అయ్యప్ప స్వామి మహాపడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ తమ్ముడు రాకేశ్ కన్నె స్వామి మాలధారణ చేశాడు. దీంతో చైర్పర్సన్ విజయలక్ష్మీ రవి దంపతులు 18 కలశాలతో మహాపడి చేయించారు. ఈ పూజకు విచ్చేసిన కలెక్టర్ శరత్ కుమార్ నాయక్కు గురుస్వాములు పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. మహాపడిలో దేవతామూర్తులతో చేసిన అలంకరణ భక్తులను మంత్ర ముగ్దుల్ని చేసింది. మహాపడి పూజలో పట్టణం, సమీప గ్రామా ల్లో మాలధారణ చేసిన స్వాములు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భిక్ష పెట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అయ్యప్ప స్వాములతో పాటు భక్తులతో కలిసి భిక్ష చేశారు. పూజలో గురుస్వాములు శ్రీశైలం, సత్యనారాయణ, డాక్టరు రాజుగౌడ్, చంద్రశేఖర్, జలేందర్, సందీప్, నాయకులు విజయేందర్రెడ్డి, రామప్ప, కొత్తపల్లి శ్రీకాంత్(నాని), విష్ణువర్దన్, శ్రీకాంత్, శ్రీధర్రెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.