సంగారెడ్డి, డిసెంబర్ 31: జిల్లాలోని పరిశ్రమల యజమాన్యాలు అభివృద్ధికి నిధులు అందజేసి సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ శరత్ కోరారు. శనివారం కలెక్టరేట్లో సీఎస్ఆర్ నిధుల పర్యవేక్షణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల యజమాన్యాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అభివృద్ధికి సహకరించేలా చర్యలు చేపట్టాలని పర్యవేక్షణ కమిటీ అధికారులకు సూచించారు.
యాజమాన్యాలు పరిశ్రమల చట్టం మేరకు సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సీఎస్ఆర్ కింద వివి ధ అభివృద్ధి పనులకు నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలకు సీఎస్ఆర్ నిబంధనలు, చట్టం మేరకు నోటీసు లు జారీ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, సీపీవో, కమిటీలోని ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.