చిన్నకోడూరు, డిసెంబర్ 17: సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ నరేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో నరేశ్ తల్లితండ్రులు, కుటుంబ సభ్యులను హరీశ్రావు పరామర్శించారు. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటానని హామీనిచ్చారు. అనంతరం చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుర్రం రాజిరెడ్డి కుమారుడు గుర్రం భాను ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను హరీశ్రావు పరామర్శించి మనోధైర్యం నింపారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, ఎఫ్పీఓ చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచ్లు శ్రీనివాస్, బాబు, ఎంపీటీసీ జమున, నాయకులు రాజిరెడ్డి తదితరులున్నారు.