మనోహరాబాద్, ఫిబ్రవరి 9 : ఆపత్కాలంలో సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు అండగా నిలుస్తుందని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ జడ్పీ క్యాంపు కార్యాలయ ఆవరణలో 18 మంది లబ్ధిదారులకు రూ. 8 లక్షల 44 వేల 500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీతరవి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, పార్టీ మండల అధ్యక్షుడు పురం మహేశ్, ఎంపీటీసీ స్వర్ణలత, సర్పంచ్లు మాధవరెడ్డి, వెంకటేశ్వర్లు, నరేందర్రెడ్డి, ఉప సర్పంచ్లు మహేందర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు భిక్షపతి, శ్రీరామ్ పాల్గొన్నారు.
రైతు బీమాతో పేదల జీవితాల్లో వెలుగు
పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 9 : రైతు బీమాతో సీఎం కేసీఆర్ అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. వీరోజిపల్లికి చెందిన రైతు చనిపోవడంతో అతడి కుటుంబసభ్యుడైన సంతోష్కు క్యాంపు కార్యాలయంలో రైతు బీమా పథకం కింద మంజూరైన రూ. 5 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. గ్రామానికి చెందిన అశోక్ రూ.18 వేలు, గొట్టిముక్కులకు చెందిన లక్ష్మికి రూ.14 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు ఉన్నారు.