చేర్యాల, అక్టోబర్ 11: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతి రూపమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.కొమురవెల్లి మల్లన్న ఆలయ గెస్ట్హౌజ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడారు. తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్కు కొమురవెల్లి మల్లన్న ఆశీస్సులు ఉన్నాయని, ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మరోసారి తెలంగాణలో విజయం సాధించి సర్కారు ఏర్పాటు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మల్లన్న స్వామి పేరిట మల్లన్నసాగర్ను సైతం నిర్మించడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చిన సీఎం కేసీఆర్కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అండగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ సర్కారు పాలనలో జనగామ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, రానున్న ఐదేండ్లలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్టతో పాటు నియోజకవర్గం మొత్తం సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికి తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు.చేర్యాల రెవెన్యూ డివిజన్ తప్పక ఏర్పాటవుతుందని, డివిజన్ ఏర్పాటు విషయంలో తాను స్పష్టతతో ఉన్నానని, నాలుగు మండలాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు అభివృద్ధి చేస్తామన్నారు.
ఈనెల 16వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్ సభకు భారీగా ప్రజలు తరలిరావాలని
పిలుపునిచ్చారు.రానున్న రోజుల్లో మేనిఫెస్టో ప్రాతిపదికన అభివృద్ధి చేస్తామన్నారు.కొమురవెల్లి, చేర్యాల మీదుగా ర్యాలీ కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఎమ్మెల్సీ పల్లా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు కొమురవెల్లి నుంచి చేర్యాల మీదుగా జనగామ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి తరలివెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్రెడ్డి తన వాహనం పై నుంచి కొమురవెల్లి నుంచి చేర్యాల మీదుగా ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
పల్లా రాక సందర్భంగా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు బైక్లపై ర్యాలీగా జనగామకు వెళ్లారు. చేర్యాల పట్టణంలోకి పల్లా ప్రవేశించిన అనంతరం బీఆర్ఎస్ జెండాను తిప్పి గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ కమిటీ డైరెక్టర్ మేడిశెట్టి శ్రీధర్, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు అంకుగారి శ్రీధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వంగా చంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, శివగారి అంజయ్య, మాజీ జడ్పీటీసీ నాచగోని పద్మావెంకట్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్లు పచ్చిమడ్ల సతీశ్, అడెపు నరేందర్, మైనార్టీ ఇన్చార్జి బీరెడ్డి ఇన్నారెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు, గదరాజు చందు, కోతి విజయ్, కామండ్ల కమలాకర్, ఆకుల రాజేశ్గౌడ్ పాల్గొన్నారు.