మెదక్ : కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, దళితబంధు పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ నిరుపేదల గుండెల్లో నిలిచిపోయారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
గురువారం రామాయంపేట పట్టణంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఇంటింటికి వెళ్లి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అద్భుతమైన పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. జనరంజక ఆపలనతో నేడు దేశ నాయకులనే ఆలోచనలో పడేశారని ఎమ్మెల్యే తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతుబీమా, మిషన్ భగీరధ తదితర పథకాలను ప్రవేశ పెట్టాలనే ఆలోచనతో ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సొంత స్థలాలు ఉన్న వారికి వారింటివద్దనే ఇళ్లు కట్టుకునేలా సీఎం నిధులను మంజూరు చేస్తున్నారని అన్నారు. వచ్చే నెల మార్చిలో అర్హులైన వారికి డబుల్బెడ్రూంలను ఇస్తామన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మాజీ సర్పంచ్ పాతూరి ప్రభావతి, కౌన్సిలర్లు యాదగిరి, గజవాడ నాగరాజు, చింతల రాధాభవాని, టీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండల్రెడ్డి, మర్కు దత్తు, శ్రీనివాస్, దేవుని రాజు, మెట్టు యాదగిరి, చింతల యాదగిరి తదితరులున్నారు.