సీఎం కేసీఆర్ హయాంలో గిరిజనులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవిస్తున్నారని, హమారా తండా.. హమారా రాజ్ అంటూ అభివృద్ధిలో దూసుకెళ్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ సేవాసంఘ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం శనివారం పటాన్చెరు జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డితో కలిసి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే బంజారాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రిజర్వేషన్లు 6 నుంచి 10శాతానికి పెంచామని, త్వరలో భర్తీ చేయనున్న 81వేల ఉద్యోగాల్లో కొత్త రిజర్వేషన్లు అమలుచేస్తామన్నారు. బంజారా ఎంప్లాయీస్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న సర్కార్ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కోరిక మేరకు బంజారా భవన్కు స్థలం కేటాయించి, భవనం నిర్మించి ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ క్యాలెండర్, డైరీని మంత్రి హరీశ్రావు ఆవిష్కరించారు.
పటాన్చెరు, జనవరి 7: హమారా తండా మే హమారా రాజ్ అంటూ గిరిజనులు తెలంగాణలో ఎలుగెత్తి చాటుతున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా రు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ బంజారా ఎంప్లాయిస్ సేవాసంఘ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూ నియన్ క్యా లెండర్ను, డైరీని మంత్రి ఆవిష్కరించారు. బంజా రా విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలను చూసి విద్యార్థులను అభినందించారు.
బంజారా ఉద్యోగ సంఘాల నేత పీపీ రాథోడ్ ఆధ్వర్యంలో మంత్రిని, ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. వేదికపై మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతున్నదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయిన తరువాత గిరిజనుల ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. 6శాతం ఉన్న రిజర్వేషన్ను 10శాతం చేశామని తెలిపారు. లంబాడాలకు ఇస్తున్న పదిశాతం రిజర్వేషన్ ఎత్తివేయాలని రాష్ట్ర బీజేపీ ఎంపీ డిమాండ్ చేయడం తగదన్నారు.
కేంద్రంలో బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు సంస్థలకు అమ్ముతున్నదన్నారు. తెలంగాణకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీకి స్థలం తమ ప్రభుత్వం కేటాయిస్తే, బీజేపీ ఇంతవరకు యూనివర్సిటీ అనుమతులు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వద్ద దానికి సమాధానం లేదన్నారు. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ అమ్ముతుండటం అందరూ చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 2,475తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు.
నూతన గ్రామ పంచాయతీల నిర్మా ణం కోసం రూ. 450కోట్లు మంజూరు చేశామన్నారు. ప్రభు త్వం భర్తి చేయనున్న 81వేల ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేసి బంజారాలకు లాభం చేకూరుస్తామన్నారు. వైద్యశాఖలో గతంలో ఎంబీబీఎస్ సీట్లు 223 ఉండగా, 10శాతం రిజర్వేషన్ అమలుతో 429 మంది గిరిజనులకు సీట్లు దక్కాయన్నారు. 206 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రావడంతో కొత్తగా మరికొందరు డాక్టర్లు అవుతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంను పోరాడి సాధించకుంటే ఈ అవకాశం వచ్చేదా అని మంత్రి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ బంజారా హిల్స్లో రూ. 23కోట్లు ఖర్చు చేసి బంజార భవన్ను నిర్మించి బంజారాలా ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు.
సంగారెడ్డిలోను బంజారా భవన్కు ఎకరా, జహీరాబాద్లో మరో ఎకరా కేటాయించామన్నారు. పటాన్చెరులోను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కోరికమేరకు బంజారా భవన్కు స్థలం కేటాయించి, భవనం నిర్మించి ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. రాష్ట్రంలోని 1.40లక్షల ఎస్టీలకు కల్యాణలక్ష్మీలో లబ్ధి చేకూర్చామన్నారు. రూ. 1126కోట్లు దానికి ఖర్చు చేశామన్నారు. బంజారా ఎంప్లాయీస్ను గుండెల్లో చూసుకుంటున్న సర్కార్ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలు బంజారాలను మోసం చేశాయన్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కా పాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని ఉద్యోగులు ప్రజలకు వివరించాలని సూచించారు.
ప్రజలకు సేవ చేయడంలోను బంజారా ఉద్యోగులు ముందున్నారని ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీల నిధు లు ల్యాప్స్ కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద వాటిని వాడుతామన్నారు. సేవాలాల్ జయంతిరోజు సెలవుకోసం ము ఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు.
తండాల్లో సేవాలాల్ దేవాలయాలు నిర్మించాం
– గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్యే పటాన్చెరు
పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు తండాలు ఉ న్నాయని వాటిలో నాలుగు తండాల్లో సంత్ సేవాలాల్ మహరాజ్ దేవాలయాలను నిర్మించామన్నారు. తండా ల్లో మిషన్ భగీరథ, రోడ్లు, తాగునీరు ఇతర సౌకర్యాల ను కల్పిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. సేవాలాల్ ఆశీస్సులతో అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. బంజారా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. బంజారా గిరిజనులను కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రభుత్వం మాదన్నారు. సీఎం కేసీఆర్ లంబాడాలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘో త్తంరెడ్డి, ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ శంకర్నాయక్, ఆర్డీ వో మెంచు నగేశ్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, బీఏఐబీఎస్ఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్సింగ్, డీఎ స్పీ భీంరెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, దేవదాస్ రాథోడ్, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, సుధాకర్రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీవేణుగోపాల్రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, రమే శ్రాథోడ్, సంఘం జిల్లా అధ్యక్షుడు మంజ్యా నాయక్, కార్యదర్శి కిషన్ ధరవాత్, డివిజన్ అధ్యక్షుడు రాగ్యానాయక్, జైపాల్నాయక్, మిర్యాలగూడ ప్రతినిధి రాం నాయక్ పాల్గొన్నారు.