‘సమైక్య పాలనలో మా బతుకులు ఆగమయ్యాయి. పుర్రె, తేలు గుర్తుతో కాంగ్రెస్ సర్కారు బీడీ పరిశ్రమను ఆగంచేసింది. బీజేపీ సర్కారొచ్చి జీఎస్టీ తెచ్చి పరిశ్రమను దెబ్బతీసింది. సమైక్య పాలకుల వివక్షతో ఆగమైన మా బతుకులకు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. ఆసరాగా నిలిచి, గౌరవంగా బతికేలా చేశారు’.. అని బీడీ కార్మికులు గర్వంగా చెబుతున్నారు. ఇంతకు ముందు ఏ ప్రభుత్వాలు తమ గురించి పట్టించుకోలేదని, కేసీఆర్ చొరవతోనే తాము పిల్లలను చదివించుకుంటున్నామని, పింఛన్తోనే చేతిలో కొంచెం పైసలు మిగులుతున్నాయని వారు పేర్కొంటున్నారు. కేసీఆర్ సార్ నెలనెలా రూ.2016 జీవనభృతి ఇస్తూ, తమ కంచంలో బువ్వ అవుతున్నడని తెలుపుతున్నారు.
– సిద్దిపేట, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని బీడీ కార్మికులు కోరుతున్నారు. ఆసరా లేని బీడీ కార్మికులకు కొండంత అండ నిచ్చిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే మాలాంటి బీడీ కార్మికులకు ఎం తో ప్రయోజనం కలుగుతుందని వారు చెబుతున్నారు. గతంలో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో బీడీ కార్మికులకు ఎన్నో సౌలత్లను దేశ వ్యాప్తంగా చేశారని వారు గుర్తు చేస్తున్నారు. బీడీ కార్మికుల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ బీడీ కార్మికులకు నెలనెలా పింఛన్ అందజేస్తూ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. పొగ చూరిన బీడీ కార్మికుల జీవితాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపింది. దేశంలోనే ఎవరూ ఇవ్వని విధంగా సీఎం కేసీఆర్ బీడీ కార్మికులకు నెలనెలా పింఛన్ ఇస్తున్నారు. దీంతో బీడీ కార్మికులు సంబురంగా ఉన్నారు. కేంద్ర ప్రభు త్వం పెట్టిన ఆంక్షలతో బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు బీడీ కార్మికులను ఓట్ల కోసమే తప్ప వారి కష్టాలను పట్టించుకున్న పాపనపోలేదు. కేంద్ర ప్ర భుత్వాలు పెట్టిన అంక్షాలతో బీడీ పరిశ్రమలు కుదేలయ్యాయి. దీంతో బీడీ కార్మికులకు సరైన పని దినాలు లేక చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కేంద్ర ప్రభుత్వాల వైఖరితో దేశంలో చాల మంది బీడీ కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈక్రమంలో ఎక్కడలేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ బీడీ కార్మికులకు అండగా నిలిచి ‘ఆసరా’ పింఛన్లు మంజూరు చేశారు. బీడీ కార్మికుల కష్టాలు స్వయంగా చూసిన సీఎం కేసీఆర్ వారికి అండగా నిలిచి బతుకు భరోసా కల్పించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పుర్రే, తేలు గుర్తులను పెట్టి బీడీ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తే, బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో బీడీ కార్మికులను మరో దెబ్బ తీసింది. ఈ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబాలలో సైతం చాలా మంది మహిళలు బీడీలు చుట్టి ఉపాధి పొందుతున్నారు. రూ.200 పింఛన్ నుంచి రూ. 2016 పింఛన్కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానిది. వారికి జీవనభృతి కల్పించేందుకు ఎనిమిదేండ్లుగా ఆసరా పింఛన్లు అందజేస్తూనే ఉంది. పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. టీఆర్ఎస్ సర్కారుతోనే తమ జీవితాల్లో భరోసా నెలకొన్నదని బీడీ కార్మికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని సీఎం కేసీఆర్కు బీడీ కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారంతా మా ఇంటి పెద్ద కొడుకు కేసీఆర్ అంటున్నారు.
కేసీఆర్ నాయకత్వంపై దేశ ప్రజల మొగ్గు
కుటుంబ పోషణ కోసం రోజంతా బీడీలు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు మా వంటి బీడీ కార్మికులను ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ సార్ బీడీ కార్మికుల బాధలు అర్థం చేసుకొని, నెలనెలా రూ.2016 పింఛన్ అందజేస్తూ ఆర్థిక భరోసాను కల్పించిండు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంపై దేశ ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
– దేశెట్టి విజయ, బీడీ కార్మికురాలు, నస్కల్, నిజాంపేట
ఢిల్లీకి వెళ్లడం గర్వకాణం
ఎన్నో ఏండ్ల కల ప్రత్యేక రాష్ట్రం, ఆ కలను నిజం చేసిన సీఎం కేసీఆర్ దేశంలో రాజకీయాల్లోకి వెళ్తే ఎన్నో విజయాలు సాధించగలుగుతారు. దేశంలో ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న నాయకుడు. అలాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో వెళ్లడం మనకు గర్వకారణం.
– కుమ్మరి శ్యామల, బీడీ కార్మికురాలు, రామాయంపేట రూరల్
మా పాలిట దేవుడు కేసీఆర్..
తెలంగాణలో బీడీ కార్మికులకు దేవుడు కేసీఆర్. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా బీడీ కార్మికుల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు వారికి నెలనెలా పింఛన్ ఇవ్వడంతో ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నాయి. మేము ఎల్లప్పుడూ ఆయన చేసిన మేలు మర్చిపోలేం. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లడం ఎంతో అవసరం. – దండు చంద్రకళ, బీడీ కార్మికురాలు, రామాయంపేట రూరల్
అన్ని వర్గాల అభ్యున్నతికి పెద్దపీట
రాష్ట్రం సాధించిన అన తి కాలంలోనే దేశంలోనే తెలంగాణను నెంబర్వన్గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ది. బీడీ కార్మికులు ఆత్మగౌరవంతో బతికేలా పింఛన్ ఇస్తున్నాడు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే సుపరిపాలన అందుతుంది.
– ఉప్పరి సునీత, బీడీ కార్మికురాలు, రంగంపేట, కొల్చారం మండలం
దేశ రాజకీయాల్లో వెళ్లడం అవసరం..
నేటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ దేశ రాజకీయా ల్లో వెళ్లడం అవసరం. విధ్వంసరక శక్తులు మ తాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ లాంటి ముందు చూపు, మేదస్సు కలిగిన నేత దేశ రాజకీయాల్లో వెళ్లాలి.
– పిట్ల దివ్య, బీడీ కార్మికురాలు, రామాయంపేట రూరల్
తెలంగాణ లెక్క దేశం అభివృద్ధి
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం తెలంగాణ లెక్క అభివృద్ధి చెందుతుంది. అందరి నాడి తెలిసిన నా యకుడు జాతీయ రాజకీయాలను మార్చగల సత్తా ఉన్న వ్యక్తి కేసీఆర్. అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ప్రధాన మంత్రి అయితే బాగుంటుంది.
– నాగులగారి స్వాతి, బీడీ కార్మికురాలు, కిష్టాపూర్, కొల్చారం