సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి 5:43 నిమిషాలకు హెలికాప్టర్లో చేరుకున్నారు. హెలికాప్టర్ గాలిలో తిరుగుతున్నప్పుడు యువకులు పెద్దఎత్తున హర్షాద్వానాలు చేస్తూ హెలికాప్టర్ ఫొటోలను సెల్ఫోన్లలో బంధించారు. అనంతరం పెద్దఎత్తున జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీశ్రావు నినాదాలు చేశారు.
సిద్దిపేట రూరల్, అక్టోబర్ 17 :
సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి 5:43 నిమిషాలకు హెలికాప్టర్లో చేరుకున్నారు. హెలికాప్టర్ గాలిలో తిరుగుతున్నప్పుడు యువకులు పెద్దఎత్తున హర్షాద్వానాలు చేస్తూ హెలికాప్టర్ ఫొటోలను సెల్ఫోన్లలో బంధించారు. అనంతరం పెద్దఎత్తున జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీశ్రావు నినాదాలు చేశారు.
కేసీఆర్ హెలికాప్టర్ దిగి సభా వేదిక వద్దకు రాగానే విజయసంకేతం చూపుతుండగా సభా ప్రాంగణం జై కేసీఆర్, జై హరీశ్రావు నినాదాలతో దద్దరిల్లింది.
కేసీఆర్ సభా వేదిక ముందుకు వచ్చి పైకి చేతి ఎత్తి సభికులకు అభివాదం చేయగానే ఈలలు వేసిన జనం, ఒక్కసారి సీట్లలో నుంచి లేచి ఘనస్వాగతం పలికారు.
మంత్రి హరీశ్రావు 5:49 నిమిషాలకు ప్రారంభ స్వాగత ఉపన్యాసం ఇస్తుండగా హరీశన్న జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తాయి.
సీఎం కేసీఆర్ 6:12 నిమిషాలకు సభికులను ఉద్దేశించి తెలంగాణ రాక ముందు సిద్దిపేట..వచ్చినంక సిద్దిపేట గురించి వివరించారు.
సీఎం కేసీఆర్ సిద్దిపేట అభివృద్ధి గురించి చెబుతుండగా సభికుల నుంచి పెద్దఎత్తున నినాదాలు రాగా.. ఇక్కడ నేను మొత్తుకునుడు.. అక్కడ మీరు మొత్తుకుంటే ఎట్ల..మీటింగ్ అయినంక గజం ఎత్తు దుంకుదాం అనగానే సభికులంతా చప్పట్లతో హుషారెత్తించారు.
సీఎం కేసీఆర్ 6:31 నిమిషాలకు ప్రసంగం ముగించగా చివరగా కారు గుర్తుకే అనగా మా ఓటు అంటూ పెద్దఎత్తున సభికుల నుంచి స్పందన వచ్చింది.