‘గజ్వేల్లో కేసీఆర్ ఉంటేనే గౌరవం…మా ముఖ్యమంత్రి… మా గజ్వేల్ అని చెప్పుకునే అవకాశం లభిస్తుంది’ అని ఆర్థిక , వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గజ్వేల్లో గురువారం సీఎం కేసీఆర్ నామినేషన్ వేయనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం హెలిప్యాడ్ ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. మాబలం..బలగం కార్యకర్తలేనని గుర్తుచేశారు.
గజ్వేల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. నాటి గతుకుల గజ్వేల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బతుకుల గజ్వేల్గా మార్చారన్నారు. విద్యాలయాలు, రిజర్వాయర్లకు నిలయంగా నియోజకవర్గం మారినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. గజ్వేల్ను నాలుగు దశాబ్దాలు ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు.
గజ్వేల్, నవంబర్ 8: గజ్వేల్లో కేసీఆర్ ఉంటేనే గౌరవం.. మా ముఖ్యమంత్రి.. మా గజ్వేల్ అని చెప్పుకునే అవకాశం వస్తుందని ఇంకొకరికి ఇలాంటి అవకాశం ఉండదని, కేసీఆర్ సహకారంతో గజ్వేల్ అభివృద్ధిలో మూడునాలుగు దశాబ్దాలు ముందుకెళ్లిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సాయంత్రం గజ్వేల్లో హెలీప్యాడ్ ప్రదేశాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గజ్వేల్ అభివృద్ధి పదాత కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు ప్రజలు ఎప్పుడెప్పుడా కేసీఆర్కు ఓటు వేసేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. కరువు పీడిత గజ్వేల్కు కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేశారని, ఎక్కడ చూసినా సిరులు కురిపించే పంటలు పండుతున్నాయన్నారు. ఎర్రటి ఎండల్లో కూడవెల్లి, హల్దీ వాగులు మత్తళ్లు దంకుతున్నాయన్నారు. నాటి గతుకుల గజ్వేల్ నేడు బతుకుల గజ్వేల్గా, విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా మారిందన్నారు. గజ్వేల్లో రింగ్రోడ్డు, యూజీడీ వంటి అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. గజ్వేల్కు గురుకుల పాఠశాలలు, హార్టికల్చర్, ఫారెస్టు, ఎడ్యుకేషన్ హబ్, డిగ్రీ కళాశాలలు వచ్చాయన్నారు. గజ్వేల్ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందులో కోకాకోలా కంపెనీ రావడంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వర్గల్లో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో ఎంతో మంది మహిళలకు ఉపాధి దొరుకుతుందన్నారు. కేసీఆర్ ఎన్నో సొసైటీలను ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇచ్చిన విషయం అందరికీ తెలుసని చెప్పారు. 24 గంటల కరెంట్తో తెలంగాణలో గుంట కూడా ఎండడం లేదన్నారు. మా బలం బలగం పార్టీ కార్యకర్తలే అని, ఒక్క పిలుపుతో 15 వేల నుంచి 20వేల మంది వస్తారని తెలిపారు.
గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి గురువారం సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి హెలీక్యాప్టర్లో గజ్వేల్ చేరుకొని నామినేషన్ వేస్తారు. అనంతరం హెలికాప్టర్లో కామారెడ్డి చేరుకొని అక్కడ నామినేషన్ వేసి ప్రసంగిస్తారు. 28న గజ్వేల్లో ఎన్నికల ప్రచార చివరి బహిరంగ సభ ఉంటుంది. సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాలతో కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. నేడు సీఎం కేసీఆర్ రెండు సెట్ల నామినేషన్లు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ జకీయొద్ద్దీన్ పాల్గొన్నారు.