పటాన్చెరు, సెప్టెంబర్ 22: జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ ముందున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల జర్నలిస్టులు వంద మందికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి ఎమ్మెల్యే ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కాజిపల్లికి చెందిన 30మంది రోడ్డు నిర్వాస బాధితులకు ఇండ్ల పట్టాలను అందించారు. మండలాల వారీగా పారదర్శకంగా ప్లాట్లను డ్రా ద్వారా కేటాయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.100 కోట్ల జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారన్నారు. తాను కూడా నియోజకవర్గంలోని అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు మూడేండ్ల పాటు హెల్త్ ఇన్సూరెన్స్ చేశానని గుర్తు చేశారు. వంద మంది నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలను ఇస్తున్నానని తెలిపారు.
ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాల్లోనూ అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు
– మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
పటాన్చెరు జర్నలిస్టులు అదృష్టవంతులు
పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మండలాల జర్నలిస్టులు అదృష్టవంతులని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జర్నలిస్టుల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతను కొనియాడారు. వందమంది జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు అందజేసి వారిలో ధీమా పెంచారన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.60 లక్షల సొంత నిధులతో జర్నలిస్టుల సంక్షేమానికి ఆరోగ్యబీమా చేయించడం చారిత్రాత్మకమన్నారు.
సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 650వందల మందికిపైగా జర్నలిస్టులు వివిధ అనారోగ్యాల కారణాలతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ అకాడమీ తరఫున కరోనా సమయంలో జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేశామన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.3 వేల పింఛన్లు ఇస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జాతీయ జర్నలిస్టు నాయకులు మారుతీ సాగర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, జడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, సుప్రజావెంకట్రెడ్డి, కుమార్గౌడ్, ఎంపీపీలు సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, ఈర్ల దేవానందం, ప్రవీణ విజయ్భాస్కర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, లలితా సోమిరెడ్డి, రోజా బాల్రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములుగౌడ్, వైస్ ఎంపీపీ స్వప్నా శ్రీనివాస్, కార్పొరేటర్లు పుష్పానగేశ్, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్యయాదవ్, ఆయా మండలాల తహసీల్దార్లు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేశ్గౌడ్, గోవర్ధన్రెడ్డి, కొలన్ బాల్రెడ్డి, అఫ్జల్, రాజేశ్, పార్టీ మండల అధ్యక్షుడు పాండు, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, సిల్వరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.