కొల్చారం, నవంబర్ 13: కొల్చారం మండలంలో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి సోమవారం రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన ప్రజలు, మహిళలు డప్పుచప్పుళ్లు, బతుకమ్మలు, బోనాలతో జన నీరాజనం పలికారు. కొల్చారం మండ లం రాంపూర్లోని పెద్దమ్మ దేవాలయంలో పూజ లు చేశారు. కిష్టాపూర్లో సర్పంచ్ గోదావరి ఆధ్వర్యంలో బోనాలతో ఎదురెళ్లి పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్య ర్థి సునీతారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కోసం పక్కా ప్రణాళికలతో అభివృద్ధి- సంక్షేమ పథకాలు చేపడ్తున్నారన్నారు. ఒకప్పుడు ఏటి కాల్వ కింద నీళ్లు కావాలంటే ఎన్నో తిప్పలు పడేవాళ్లమని, నేడు కిష్టాపూర్, రాంపూర్ గ్రామాలకు అవసరమైనప్పుడు సింగూరు నుంచి నీళ్లు వస్తున్నాయన్నారు. గతం లో ఎమ్మెల్యేగా, మంత్రిగా కొల్చారం మండల కేంద్రానికి రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, మండల పరిషత్, తహసీల్ కార్యాలయాలు మంజూరు చేయించానన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలు తీర్చడానికి కృషి చేశా. అన్న మదన్రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారన్నారు.
మహా పండితుడు మల్లినాథసూరి జన్మించిన పుణ్యస్థలంలో సంస్కృత యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగె రమేశ్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సర్పంచ్లు గోదావరి, కరెంటు ఉమాదేవి, మన్నె శ్రీను, లంబాడి మోతి, నెల్లి కిష్టయ్య, మాధవి శ్రీశైలం, మానస, ఇందిరా ప్రియదర్శిని, శ్రీనివాస్ నాయక్, నాగరాణి, వీరారెడ్డి, బండి సుజాత, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, వెంకట్గౌడ్, యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, ఆత్మ డైరెక్టర్ ఆంజనేయులు, ఏఎంసీ వైస్ చైర్మన్ సావిత్రీరెడ్డి, ఎంపీటీసీలు ఉదయ వేమారెడ్డి, అరుణ కృష్ణాగౌడ్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ నాయకులు మోహీయోద్దీన్, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ముత్యం ప్రవీణ్కుమార్, కాశినాథ్,జంగిటి పోచయ్య, గోవర్ధన్రెడ్డి, నెల్లి రాజు, మహ్మద్, సోమ నర్సింహులు, తలారి దుర్గేశ్, రవీందర్గౌడ్, బీఆర్ఎస్ మండల యువ త అధ్యక్షుడు సంతోష్రావు, రవితేజరెడ్డి, శ్రీనివాస్గౌడ్, విజయభాస్కర్రెడ్డి, మాజీ సర్పంచ్లు విఠల్రెడ్డి, ఆశన్నగారి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.