దుబ్బాక, నవంబర్ 25: దుబ్బాకలో ఆదివారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. శనివారం భద్రతా ఏర్పాట్లు, సభాస్థలి, హెలీప్యాడ్, ఫార్కిం గ్ స్థలాలను పరిశీలించారు. బందోబస్తుపై పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనాలను ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలని సూచించారు. అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో 6 సెక్టార్లుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు అందె శ్రీనివాస్రావు, ఎస్.మల్లారెడ్డి, రాంచందర్రావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు సురేందర్రెడ్డి, రమేశ్, చంద్రశేఖర్, రవీందర్ రాజు, ప్రసన్నకుమార్, శ్రీనివాస్, సీఐ, సిబ్బంది పాల్గొన్నారు.
దుబ్బాక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉన్నందున దుంపలపల్లి, చీకోడు, రామక్కపేట, ఆకారం, ఎనగుర్తి తదితర గ్రామాల వైపు నుంచి వచ్చే వాహనదారులు టీటీడీ కల్యాణ మండపం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేయాలి.
భూంపల్లి, ఖాజీపూర్, చేగుంట, నార్సింగ్ మండలాల నుంచి వచ్చే వారు దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన కుడి, ఎడుమ వైపున ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేయాలి.
అప్పనపల్లి, పెద్దచీకోడు, తిమ్మాపూర్, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్ మండలాల నుంచి వచ్చే వారు దుంపలపల్లి చెరువుకట్ట కింద ఖాళీ స్థలంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
అక్బర్పేట-భూంపల్లి, చేగుంట, నార్సింగ్, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల నుంచి వచ్చే వాహనదారులు అక్బర్పేట కూడవెల్లి బ్రిడ్జి దాటిన తర్వాత చౌదర్పల్లి కమాన్ నుంచి దుబ్బాక మీటింగ్ ప్రదేశానికి చేరుకోవాలి. మిరుదొడ్డి, తొగుట మండలాల నుంచి వచ్చే వాహనదారులు ధర్మారం నుంచి దుంపలపల్లి మీదుగా దుబ్బాక సమావేశం ప్రదేశానికి చేరుకోవాలి.