సిద్దిపేట, ఫిబ్రవరి 23: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో మరో క్రీడా సంగ్రామం మొదలైంది. మంత్రి హరీశ్రావు నేతృత్వంలో జరుగుతున్న సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్-3 మ్యాచ్లు గురువారం ఉదయం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నిర్వాహకులు మచ్చ వేణుగోపాల్రెడ్డి, మల్లికార్జున్ టాస్ వేసి మ్యాచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడానైపుణ్యం పెంచే దిశగా మంత్రి హరీశ్రావు గత మూడేళ్ల నుంచి క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారన్నారు. యువత ఉత్సాహంగా పాల్గొని క్రీడాస్ఫూర్తి చాటుతున్నారని తెలిపారు. ఇటీవలనే సీఎం కేసీఆర్ ట్రోఫీకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందంటేనే యువతలో క్రీడాస్ఫూర్తికి నిదర్శమని చెప్పారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని సూచించారు.
సిద్దిపేటలో వివిధ జట్ల మధ్య సాగుతున్న క్రికెట్ పోటీలు
తొలిరోజు హోరాహోరీగా…
శ్రీచైతన్య యూత్ తోర్నాల వర్సెస్ జై బాలయ్య టీమ్ అల్లీపూర్ తలపడగా జై బాలయ్య టీమ్ మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. 70 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన శ్రీచైతన్య యూత్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేసింది. జై బాలయ్య టీమ్ విజయం సాధించింది. గుర్రాలగొంది బీ టీమ్పై దమ్మచెరువు టీమ్ గెలిచింది. తర్వాత మ్యాచ్లో బచ్చాయిపల్లి టీమ్పై నవజ్యోతి టీమ్కు విజయం దక్కింది. ఫ్రెండ్స్ యూత్ మెట్పల్లి వర్సెస్ శంకర్నగర్ మధ్య జరిగిన మ్యాచ్లో విజయం శంకర్నగర్ టీమ్ను ముద్దాడింది. నంగునూరు క్లబ్ టీమ్పై కోదండరావుపల్లి జట్టు గెలిచింది. మేడిపల్లి టీమ్పై రాజ్గోపాల్పేట టీమ్ జయకేతనం ఎగురవేసింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేస్తున్న నిర్వాహకులు