మెదక్ మున్సిపాలిటీ, మార్చి 8: మహిళల ఆరోగ్య రక్షణ కోసం రా్రష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్లు ఏర్పా టు చేసిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నా రు. బుధవారం మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేశ్, డీఎంహెచ్వో చందునాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని మహిళా దినోత్సవం రోజున చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు, గర్భిణులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కేంద్రంలో 57 రకాల పరీక్షలు చేస్తారన్నా రు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా వైద్యులు, నర్సులను ఎమ్మెల్యే, కలెక్టర్, అదనపు కలెక్టర్ సన్మానించారు.
ఘనంగా మహిళా దినోత్సవం
డీఆర్డీవో ఆధ్వర్యంలో మెదక్లోని సాయిబాలాజీ గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేశ్, డీఆర్డీడీవో శ్రీనివాస్తో ఘనంగా జరుపుకొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నదన్నారు. జిల్లాలోని 10,749 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.38,35,43,000 చెక్కు, మెప్మా ద్వారా 568 సంఘాలకు రూ 3.79 కోట్ల చెక్కును కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. మహిళా సమాఖ్య భవనానికి స్థలంతో పాటు నిధులు మంజూరు చేయాలని అధ్యక్షురాలు నవనీత విజ్ఞప్తి చేశారు. త్వరలో స్థలంతో పాటు నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా రుణాలు: కలెక్టర్ రాజర్షి షా
దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నదని, సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. రుణాలు అందించడంలో మెదక్ రాష్ట్రంలో రెండోస్థానంలో ఉందన్నారు. బ్యాంకు లింకేజీ, రుణాల పంపిణీలో ప్రతిభ కనబర్చి లక్ష్యాలను అధిగమించిన మండల సమాఖ్యలు, ఏపీఎంలు, స్తీనిధి సహాయకులు, వీఏవోలను శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో మెప్మా పీడీ ఇందిర, డీఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, కిశోర్, వసంత్రాజ్, బట్టి లలిత, ద ఆర్ఎంవో కిరణ్కుమార్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, కిశోర్, వసంత్రాజ్, ఏఎంసీ డైరెక్టర్ శంకర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు లింగారెడ్డి, అశోక్, శివరామకృష్ణ పాల్గొన్నారు.