సిద్దిపేట టౌన్, డిసెంబర్ 25: ఏసు ప్రభువు కరుణామయుడు. ఆయన మార్గం అనుసరణీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని సీఎస్ఐలో సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రెవరెండ్ ఆంటోనీ, చిన్నారులతో కలిసి క్రిస్మస్ కేక్ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
23 ఏండ్లుగా సిద్దిపేట సీఎస్ఐలో జరిగే వేడుకల్లో తప్పకుండా పాల్గొని అందరితో పండుగ సంతోషాలు పంచుకుంటానన్నారు. క్రిస్మస్ అందరి జీవితాల్లో నవకాంతులు నింపాలని ఏసు ప్రభువును ప్రార్థించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో క్రైస్తవుల సంక్షేమానికి అనే కార్యక్రమాలను నిర్వహించామన్నారు. తన జీవితం ప్రజా సేవకు అంకితమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, నాయకులు పాలసాయిరాం, కౌన్సిలర్ సాయి ఈశ్వర్గౌడ్, సత్యానందం, ప్రసాద్ ఉన్నారు.