మెదక్ : దళిత ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్న ఏకైక సీఎం కేసీఆర్ అని టీఎన్జీవోల జిల్లా అధ్య క్షుడు దొంత నరేందర్ అన్నారు. హుజూరాబాద్లో జరిగిన సభలో సీఎం కేసీఆర్ దళిత బందు పథకాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు పథకం ప్రకటించడాన్ని మెదక్ జిల్లా టీఎన్జీవోల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ మాట్లాడుతూ వెనుకబడిన అన్ని వర్గాల వారికి ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు దళితులు ఎప్పటికీ రుణపడి ఉంటారని గుర్తు చేశారు. కార్యక్ర మంలో జిల్లా కార్యదర్శి మినీకి రాజ్కుమార్, సహ అధ్యక్షుడు ఎండి సాదిక్అలీ, కోశాధికారి బట్టి రమేశ్, ఉపాధ్యక్షురాలు గాండ్ల అనురాధ, ఉపాధ్యక్షులు మంగ మనోహర్, ఎండి ఇక్బాల్ పాషా, ఫణిరాజ్, ఎండి ఫజల్ఉద్దీన్, మెదక్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు పంపరి శివాజీ, ఆరేళ్ల రామాగౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాధ, ప్రచార కార్యదర్శి చిరంజీవా చార్యులు, కార్యవర్గ సభ్యులు కిరణ్కుమార్, పశు సంవర్ధక శాఖ జిల్లా కార్యదర్శి సలావుద్దీన్, సంతోష్, వెంకటేశ్, శ్రీకాంత్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.