చిన్నారులకు పౌష్టికాహారం ఆరోగ్యానికి మేలు
జాగ్రత్తలు తప్పనిసరి
వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలి
మెదక్ రూరల్, ఏప్రిల్ 17 : రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. వారం రోజులుగా పరిస్థితి మరింత తీవ్రంగా మారుతున్నది. ఎండలు దంచికొడుతుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్రమైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు నమోదు అవుతున్నాయి. జూన్ మొదటి వారం వరకు ఇలానే కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు గర్బిణులు అత్యవసరమైతే తప్పా బయటకు తీసుకరావద్దని చెబుతున్నారు. వారు త్వరగా డీ-హైడ్రేషన్కు గురియ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అధిక ఎండల వల్ల వాంతులు, విరేచానాలు వంటి సమస్యలు ఎదురవుతాయి.
జాగ్రత్తలు
ఎక్కడ పడితే అక్కడ పండ్ల రసాలు నీరు తాగొద్దు. ఇంటి నుంచే బాటిల్లో నీళ్లు తీసుకెళ్లాలి. బయట నీరు శీతల పానీయాలు తాగడం వలన ఆరోగ్యానికి ప్రమాదముంది. పిల్లలు రోగ నిరోధనక శక్తి తక్కువ ఉండటంతో త్వరగా ఆనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
పిల్లలు సాధ్యమైనంత వరకు ఇంటిలోనే ఉంచి, సి విటమిన్ గల పండ్ల రసాలు ఇవ్వాలి. నీటిని ఎక్కువగా తాగేలా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్థలను తీసుకోవాలి. నూనే పదార్థలు, జంక్పుడ్కు దూరంగా ఉండాలి. పిల్లలకు చలవ దుస్తులు వేయాలి. పిల్లలు ఇంట్లో ఉండేటట్లు ఇండోర్ గేమ్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లిదండ్రులు వైద్యులు సూచనలు తప్పకుండా పాటించాలి.
పిల్లలను ఎండకు తీసుకురావద్దు
పిల్లలు సున్నితంగా ఉంటారు. సూర్యరశ్మిని వారు తట్టుకోలేరు. ప్రధానంగా వేసవిలో పిల్లతో కలి సి ద్విచక్రవాహనంపై ప్రయాణించొద్దు తప్పనిసరి అయితేనే బయటకి వెళ్లాలి. లేక పోతే ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. కలుషితనీరు ఆరు బయట దొరి కే శీతల పానియాలు, పండ్ల రసాలు తీసుకోకూడదు. ఎండలో తిరిగితే వడదెబ్బ వచ్చే ప్రమాదం ఉం టుంది. ఇంటిలో ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్లు నిలువ ఉంచుకోవాలి. ఏ మాత్రం అలసటగా ఉన్న వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
– డాక్టర్ చంద్రశేఖర్, మెదక్,
(చిన్నపిల్లల వైద్య నిపుణుడు)