మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 21: ధైర్య సాహసాలకు మారుపేరైన ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క రూ ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మాదేవేందర్రెడ్డితో పాటు ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రె డ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, భువనేశ్వరి పీఠాధిపతి కమలానందభారతిస్వామి హాజరై విగ్రహావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ శివాజీ మార్గదర్శనంలో అం దరూ నడువలన్నారు. రాందాస్ చౌర స్తా శివాజీచౌక్గా మారనుందన్నారు. పట్టణానికి అందం తెచ్చేలా ఇంత పెద్ద విగ్రహాన్ని నెలకొల్పడానికి కృషి చేసిన కమిటీని అభినందించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడిన వీరుడు శివాజీయేనన్నారు. తల్లి నుంచి నైతికతను నేర్చుకున్న శివాజీ మెగులులను తరిమికోట్టి హిందూ ధర్మాన్ని నిలబెట్టారన్నా రు. దేశంలోని ప్రతి చౌరస్తాలో శివాజీ విగ్రహాలు పెట్టాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
పట్టణంలో భారీ ర్యాలీ
కార్యక్రమంలో భాగంగా విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు మాయ శంకర్ ఆధ్వర్యంలో ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు వేలాది మందితో బజాబజాంత్రీల తో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ర్యాలీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు, పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.