రామచంద్రాపురం, జనవరి 5: ‘చెలికుంటకు గండి.!’ అనే శీర్షికను గురువారం నమస్తే తెలంగాణ ప్రచురించడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించారు. చెలికుంట పరిసరాల్లో ఇరిగేషన్ ఏఈ సంతోషి పర్యటించి కుంటను సర్వే చేసి ఎఫ్టీఎల్ పరిధిని మార్క్ చేశారు. చెలికుంటకు, ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఇరిగేషన్ అధికారులను రెవెన్యూ అధికారులు అడిగారు.
చెలికుంట ఎఫ్టీఎల్లో మట్టిని నింపడంతో ఇరిగేషన్ అధికారులు పోలీస్స్టేషన్లో బాధ్యులపై పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా తెప్పించుకుంటామని, అన్ని నివేదికలను జత చేసి కలెక్టర్కు పంపిస్తామని తహసీల్దార్ జయరాం చెప్పారు.
స్వయంగా చెలికుంటను పరిశీలించి పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరిస్తామన్నారు. చెలికుంట విషయంలో నమస్తే తెలంగాణ ప్రచురించిన వార్తా కథనానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్టీఎల్లో నింపిన మట్టిని తొలిగించడంతో పాటు చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.