టేక్మాల్, అక్టోబర్ 30: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం అంధకాంలోకి వెళ్తుందని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం ఆయన టేక్మాల్ మండల కేంద్రంతోపాటు కోరంపల్లి, కొత్తపల్లి, గొల్లగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ముందుగా కొరంపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధికి కేరాఫ్గా నిలిపారన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను నేరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. కార్ణాటకలో ప్రజలు పడుతున్న కరెంట్ కష్టాలు, తెలంగాణ ప్రజలకు పీడకలలాంటివని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమతుందన్నారు. అనంతరం టేక్మాల్లోని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్, ఎంపీపీ చింతా స్వప్నారవి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు శ్వేతా చంద్రశేఖర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు నాయికోటి సుప్రజా భాస్కర్, నాయికోటి శ్రీనివాస్, శ్రీను, ఉప సర్పంచ్ పట్నం ప్రమీల, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.