జహీరాబాద్, నవంబర్ 30: ఝరాసంగం మండలంలోని బర్థిపూర్ గ్రామంలోని దత్తగిరి మహరాజ్ శత జయంతి మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను మాతృశ్రీ అనసూయా మాత, వైరాగ్య శిఖామణి ఆవధూతగిరి మహరాజ్, డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. మహాత్ములు, పీఠాధిపతులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అతిరుద్రము, రుద్రసహిత దత్తయజ్ఞం, గోపూజ, శతకోటి జపూజ్ఞం నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేశవు కేశవరావు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, రాంబాబు జగద్గురులు పూజలు చేశారు.
కేతకీలో పూజలు చేసిన భక్తులు
ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరా దేవాలయంలో రాంబాబు జగద్గురు, భక్తులు పూజలు చేశారు. రాంబాబు, జగద్గురుకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో భక్తులు పీఠాధిపతులు పాల్గొన్నారు.