జిన్నారం, ఫిబ్రవరి 17 : కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేసి, సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ చైర్పర్సన్ గద్దె సుష్మ, వైస్ చైర్మన్ మహేందర్గౌడ్తో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ జడ్పీటీసీ బాల్రెడ్డితో కలిసి మంగళవారం పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్రెడ్డితో పాటు బీజేపీకి చెందిన కౌన్సిలర్లు, నాయకులు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్తో కలిసి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేను కౌన్సిలర్లు సన్మానించారు. జిన్నారం మున్సిపల్కు చెందిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు చెప్పారు.