ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి రోడ్లపై బైఠాయించారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నల్లజెండాలు పట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.
పలు చోట్ల ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్ని కుట్రలు, అరెస్టులు చేసినా ఎంత మంది ఈడీలు, మోదీలు వచ్చినా భయపడేది లేదని నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
-సిద్దిపేట జిల్లా నెట్వర్క్, మార్చి 16