మనోహరాబాద్, నవంబర్ 21 : ‘ఒకప్పుడు ఊర్లల్లో వ్యవసాయం చేస్తుండు అంటే పిల్లనిస్తందుకు బయపడుతుండే.. నేడు రైతంటే రాజు లెక్క చూస్తున్నరు.. వెతికి వెతికి పిల్లనిస్తున్నరు.. ఇందంతా సీఎం కేసీఆర్ వల్లే జరిగింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం మహా ప్రాజెక్టు, వరికి మద్దతు ధరలు పెంచి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు’.. అని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పన్యాల భూపతిరెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి, రాష్ట్ర నాయకుడు ర్యాకల శేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి, కూచారం, జీడిపల్లి, వెంకటాపూర్ అగ్రహరం, పాలాట, రామాయిపల్లి, లింగారెడ్డిపేట తదితర గ్రామా ల్లో రోడ్ షో నిర్వహించారు. ప్రతి గ్రామంలో డప్పు చప్పుళ్లు, కళాకారుల ఆటపాటలతో బీఆర్ఎస్ నేతలకు ఘన స్వాగతం పలికారు.
బైక్ ర్యాలీలు, కేసీఆర్ జిందాబాద్, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ నినాదాలతో గ్రామాలన్నీ మార్మోగాయి. ఆయా గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకప్పుడు మనోహరాబాద్ మండలంలోని గ్రామాలు ఎట్లుండే.. ఇప్పుడెట్లున్నాయి.. సీఎం కేసీఆర్ అడగకముందే మనోహరాబాద్ను ప్రత్యేక మండలంగా మార్చి, మారుమూల పల్లెలు, మదిర గ్రామాలకు, గూడెంలు, తండాలకు ప్రత్యేక హో దా కల్పించి కోట్లాది నిధులు మంజూరు చేశారన్నారు. ప్రతి గ్రామంలో మహిళా భవ నం, కొత్త పంచాయతీ, లైబ్రరీ, యూత్ భవనాలు, ఇంటింటికీ నల్లా కనెక్షన్, డివైడర్తో సహా డబుల్లైన్ రోడ్లు వేయించారన్నారు. మండల కేంద్రంలోనే నూతన ప్రభుత్వ దవాఖానను నిర్మించి, మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా ‘మన ఊరు – మన బడి’ కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చారన్నారు.
హైదరాబాద్ తర్వాత ఉపాధి కేంద్రంగా మనోహరాబాద్ మండలాన్ని మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. నాలుగు పారిశ్రామిక వాడలను మంజూరు చేసి వందలాది అతిపెద్ద పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. దీంతో వేలాది మంది యువతకు, కూలీలకు ఊరు పక్కనే ఉపాధి దొరుకుతున్నదన్నారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో ఉపాధి లేక మనోహరాబాద్ మండలానికి వలస వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ఒకే చోట అన్ని పనులు జరుపుకొనేందుకు మనోహరాబాద్ మం డల కేంద్రంలో అన్ని కార్యాలయాలను ఒకే చోట నిర్మిస్తున్నారన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, సీఎం కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్కుల మహిపాల్రెడ్డి, రైతుబంధు మండల కో -ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, ఎంపీపీ పురం నవనీతారవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, ఉపాధ్యక్షుడు రతన్లాల్, యూత్ అధ్యక్షుడు రాహుల్రెడ్డి, సర్పంచ్లు రేఖామల్లేశ్, పంజాలక్ష్మి, ప్రభావతి పెంటయ్య, రేణుక, ఉప సర్పంచ్లు మహేందర్గౌడ్, వెంకటేశ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు నరేశ్ ముదిరాజ్, లక్ష్మణ్, శ్రీను, నీలగిరిగౌడ్, బాలుయాదవ్, రాజు, పెంటాగౌడ్, పంజా భిక్షపతి, శ్రీనివాస్గౌడ్, పల్లపు రమేశ్, నాయకులు నర్సింహాగౌడ్, ఉదయ్రంజన్గౌడ్, మంగ్యానాయక్, ఉదయ్ రంజన్గౌడ్, విఠల్, వీరేశ్, మహేశ్, రమేశ్, శ్రీను, సాయి, నందు, యాదగిరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.