వెల్దుర్తి, అక్టోబర్ 30: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మాసాయిపేట మండల పరిధిలోని రామంతాపూర్లో రేణుకాఎల్లమ్మ దేవాలయంలో పూజలు, దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రామంతాపూర్తోపాటు లింగారెడ్డిపల్లి, రామంతాపూర్ తండాల్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన పలువురు కార్యకర్తలు, బాధితుల కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నివర్గాలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తూ, ఆదుకుంటుందన్నారు. వారివెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, జడ్పీటీసీ రమేశ్గౌడ్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు మధుసూదన్రెడ్డి, భూపాల్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ వేణుగోపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, నాయకులు మోహన్రెడ్డి, నాగరాజు, నర్సింలు, స్టేషన్ శ్రీను, నర్సింహారెడ్డి, బాలేశ్, సిద్దిరాంలు, శ్రీనివాస్రెడ్డి, కృష్ణాగౌడ్, శ్రీనునాయక్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.