తూప్రాన్, ఏప్రిల్ 12: రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ఎడారిలాంటి కరువు పీడిత ప్రాంతమని, ఇప్పుడు అంతా మాగాణిలా మారిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధl తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది ఎన్నికలెప్పుడొచ్చినా గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. తూప్రాన్ పట్టణంలోని లింగారెడ్డి గార్డెన్స్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిలతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందన్నారు. యునెస్కో ప్రపంచంలో 20 పథకాలను ఎంపిక చేస్తే అందులో రైతుబంధు, రైతుబీమా ఉండడం దేశానికే గర్వకారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ మాగాణిలా మారిందని, రైతుల కండ్లల్లో వెలుగులు నిండాయన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నదని,అంబానీ, అదానీలకు దోచి పెట్టడానికే బీజేపీ సర్కార్ పనిచేస్తున్నదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని జోస్యం చెప్పారు.
వారం తూప్రాన్ మండలంలోని లింగారెడ్డి గార్డెన్స్లో పట్టణ అధ్యక్షుడు సరాఫ్ సతీశ్ చారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూంరెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్సిపల్ పరిధిలోని 16 వార్డుల నుంచి భారీగా హాజరైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కేసీఆర్ పంపించిన ‘అన్నం తినో.. అటుకులు తినో.. అంటూ సాగే ఆత్మీయ సమ్మేళన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ఎమ్మె ల్సీ మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా ఆత్మీయ సమ్మేళనానికి తరలివచ్చిన మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ఆనందం ద్విగిణీకృతమవుతుందన్నారు.
సామాన్యుల నడ్డి విరిచేందుకే కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ నేడు రూ.1,200లకు చేరిందన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాసేందుకే పనిచేస్తోందని, అంబానీ, అదానీలకు దోచి పెట్టడానికే మోదీ ఉన్నాడని ఆరోపించారు. అదానీది అంత పెద్ద కుంభకోణం జరిగినా పార్లమెంటులో చర్చపెట్టే దమ్ము లేదన్నారు. ఇటీవల శ్రీలంకలో కూడా ఒక ప్రాజెక్టును ఆదానికి కేటాయించాలని మోదీ ఒత్తిడి చేయడం ఆ దేశ ఆర్థిక మంత్రి స్వయంగా వెళ్లడించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సీటీల్లో దుష్ప్రచారాలకే పరిమితమియ్యిందని ఎద్దేవా చేశారు. మనం పండించిన పంటను కేంద్రం కొనే స్థితిలో కూడా లేదని, వ్యవసాయోత్పత్తిలో పంజాబ్ను మించిపోయామన్నారు. కోట్లు ఖర్చు చేసి నీళ్లు పారిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకుల కండ్లల్లో నీరొస్తుందన్నారు. నిన్న మొన్నటి వరకు పేపర్ లీక్ అని బండి సంజయ్ హంగామా చేసి జైలుకు వెళ్లాడని, ఆయన పేపర్ లీక్ చేశాడు కాబట్టే బయటకు వచ్చిందని, సంజయ్ జైల్లో ఉన్నప్పుడు పేపర్ లీక్ కాలేదన్నారు.
తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతున్నదని, కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఇందుకు ఉదాహరణ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయన్నారు. యునెస్కో ప్రపంచంలో 20 పథకాలను ఎంపిక చేస్తే, అందులో మన రైతుబంధు, రైతుబీమా పథకాలు ఉండంటం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ను ఎప్పుడు కలిసినా నీళ్ల కోసమే తహతహలాడేవాడన్నారు. బోర్లు, బావుల్లో నీరులేని దయనీయ స్థితి నుంచి మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందివ్వడంతో తెలంగాణ మాగాణిలా మారిందన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిల సమ్మేళనంతో రాష్ట్రం ప్రగతిలో దూసుకుపోతుందన్నారు. అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తూ ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ పెద్ద కొడుకయ్యాడన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం అందుతున్నదని, దాదాపు 500లకుపై పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దేశంలో కేవలం ఒక్క కేసీఆర్కే దక్కుతుందన్నారు. నాటి గజ్వేల్ నియోజకవర్గానికి నేడు మనం చూస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే విధంగా ప్రజలు ముందుకు సాగుతున్నారని, ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన సభ ఘన విజయమే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉండేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 24 గంటల కరెంటు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇప్పటికీ రైతులకు సరైన విద్యుత్ అందించే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర నిత్యం ధర్నాలు జరుగుతుండేవని, అసెంబ్లీ జరుగుతుంటే లాంతర్లు, ఎండు గడ్డి పట్టుకొచ్చేవారన్నారు. ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా సమసిపోయిందన్నారు. దేశంలోనే అత్యధిక విద్యుత్ వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణ, 16 వేల మెగావాట్లను విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు కడితే దశాబ్దాలు గడిచిపోయేవి, తెలంగాణ ఏర్పాటు అనంతరం కాళేశ్వరంలాంటి పెద్ద ప్రాజెక్టు కేవలం మూడేండ్లల్లో నిర్మించుకున్నామని ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. గోదావరి నీళ్లను కాలువల ద్వారా, ఉమ్మడి మెదక్ జిల్లాకు తీసుకువచ్చి అటు సాగు, ఇటు తాగునీరందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గెలుపు బీఆర్ఎస్దే అన్నట్లుగా పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టగానే మోదీకి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ప్రధాని హోదాలో ఓ మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చాడంటే అర్థం ఉంది. కానీ, కేవలం ఒక రైలును ప్రారంభిండానికి హైదరాబాద్ రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోని ప్రతి రాష్ర్టానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పోలవం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు, మన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇప్పుడా పద్ధతి లేదని తేల్చి చెప్పారని, కానీ మొన్నీమధ్య కర్ణాటకలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన మాటను గుర్తు చేశారు. కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, నాచారం ట్రస్ట్బోర్డు మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ దీపక్రెడ్డి, కౌన్సిలర్లు కొడిప్యాక నారాయణ గుప్తా, చింత రవీందర్రెడ్డి, రామునిగారి శ్రీశైలంగౌడ్, బొంది అరుణ వెంకట్గౌడ్, లావణ్య దుర్గారెడ్డి, ఉమా సత్యలింగం, నాయకులు సర్గల శ్రీనివాస్, సత్తార్, గుమ్మడి శ్రీనివాస్, రాజేశ్వర్శర్మ, పసుల నారాయణ, విజయ్ కుమార్, యాసిన్, నాని వెంకట్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.