మునిపల్లి, జనవరి 28 : మండల పరిధిలోని బుసారెడ్డిపల్లి గ్రామ శివారులోని సింగూరు ప్రాజెక్టులో ఆదివారం బోటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగూరు ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన పర్యాటకులు బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపడంతో సింగూరు ప్రాజెక్టు ప్రాంతం అంతా సందడిగా మారింది.
ఆదివారం నుంచి సింగూరు ప్రాజెక్టులో ప్రతి రోజు పర్యాటకులకు బోటింగ్ అందుబాటులో ఉంటుందని, చిన్నపిల్లలకు బోటింగ్ అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు.