మెదక్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : బీజేపీ బీసీ వ్యతిరేకమని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాద వ్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లాకేంద్రంలో బీసీ జనసభ ఆధ్వర్యంలో బీసీ జనగణన, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ జనసభ జిల్లా అధ్యక్షుడు కిరణ్గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ తాను బీసీ అని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. దేశంలోని బీసీలంతా ఆయన వెంట నడిచారన్నారు. కానీ, మోదీ మాత్రం బీసీలకు మొండి చేయి చూపించారన్నారు. సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జనగణన చేయమని చెప్పిందన్నారు.
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించకపోవడం దారుణమన్నారు. కనీసం బీసీ మంత్రిత్వశాఖ నరేంద్ర మోదీ ఏర్పా టు చేయకపోవడం బీసీలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతున్నదన్నారు. చెట్టు, పుట్ట, రాయిరప్పలకు జనాభా లెక్కలు ఉంటాయని, కానీ, బీసీలకు లెక్కలు ఉండవన్నారు. నాడు మండల కమిషన్ రిపోర్టును వీపీ సింగ్ అమలుపర్చడానికి సిద్ధపడితే, అద్వానీ మండల రథయాత్ర చేసి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. అంబానీ, ఆదానీలకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ పేదల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. తెలంగాణలో అభివృద్ధి ఎజెండాపై బీజేపీ ముం దుకు రావాలన్నారు. బండి సంజయ్ యువతను రెచ్చగొట్టి మతకలహాలు, కుట్రలు సృష్టించి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారన్నారు. భవిష్యత్లో బీసీ జనసభ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బీసీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్థి నాయకుడు హరీశ్గౌడ్ మాట్లాడుతూ కేంద్రం బీసీ విద్యార్థులకు బీసీ ఫెలోషిప్స్ ఇప్పటి వరకు వేయకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. యూనివర్సిటీలను తన ఆధీనంలోకి తీసుకొని విద్యార్థుల్లో మతవిద్వేషాలు సృష్టిస్తూ విద్యను కాషాయీకరణ చేయడానికి ప్రయ త్నం చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ, బీసీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు హరీశ్గౌడ్, బీసీ జనసభ ఉపాధ్యక్షుడు బోర సుభాష్, ఓయూ జేఏసీ నాయకులు మధు యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ సాగర్, వినోద్, శ్రీకాంత్, పోశెట్టి, గాజుల రమేశ్, ప్రశాంత్, బాలు, సతీశ్, ఆదర్శ్, సాయిలు, శరవయ్య పాల్గొన్నారు.