కోహీర్, ఏప్రిల్ 5: సంఘ సంస్కర్త, తొలి ఉపప్రధానిగా చరిత్రలో నిలిచిన బాబూ జగ్జీవన్రామ్ దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేశాడని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా జహీరాబాద్ పట్టణంలోని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. దళిత జనోద్ధారణ కోసం ఎంతో కృషి చేశాడన్నారు. కార్యక్రమంలో నారాయణ, వెంకటేశం, భాస్కర్, బండి మోహన్, స్వామిదాస్, అశోక్రెడ్డి, రాంచందర్, గౌతం మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, ఏప్రిల్ 5: అంటరానితనం, అణచివేతకు గురైన దళితుల పక్షాన నిలబడి కులవివక్షపై పోరాడిన తొలి నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా దేశాభివృద్ధి ప్రధాతగా బాబూ జీవితం ఆదర్శప్రాయమని కొనియాడారు.అణగారిన కులాలకు వెన్నెముకగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేసిన మానవతావాధి అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జైపాల్రెడ్డి, బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సింహులు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
జిల్లా టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ ఆధ్వర్యంలో ఉద్యోగులందరూ బాబూ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, వెంకట్రెడ్డి, భాస్కర్, రమేశ్, మల్లికార్జున్, రవికృష్ణ, దుర్గేశ్, మహేశ్వర్రావు, హెచ్డబ్ల్యూవో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 5: మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ జయంతిని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్రామ్ విగ్రహానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేశ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ ఉపప్రధాన మంత్రిగా బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని ఆయన కాంక్షించారని పేర్కొన్నారు. జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్రెడ్డి, విద్యుత్ అధికారి మాధవ్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి రామాచారి, సం బంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్రామ్ చిత్రపటానికి డీఈవో వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జగ్జీవన్రామ్ చేసిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏసీవో లింబాజీ, పాటాన్చెరు ఎం ఈవో పీపీ రాథోడ్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పటాన్చెరు, ఏప్రిల్ 5: తొలితరం జాతీయ నాయకుడు, జగ్జీవన్రామ్ చూపిన బాటలో నడవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జగ్జీవన్రామ్ భవన్లో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగ్జీవన్రామ్లాంటి దేశభక్తులు పుట్టడం మన అదృష్టం అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన చరిత్ర ఆయనదన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఉత్తమ పరిపాలనాధక్షుడని కొనియాడారు. బలహీనవర్గాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మెట్టు కుమార్యాదవ్, విజయ్కుమార్, అఫ్జల్, వెంకటేశ్, శంకర్, అంతిరెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
మ్మడిదల, ఏప్రిల్ 5: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు దేశ మాజీ ఉపప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్రాం జయంతిని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గుమ్మడిదల తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాభవాని, రెవెన్యూ సిబ్బందితో కలిసి జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
మునిపల్లి, ఏప్రిల్ 5: మండల అంబేద్కర్ యువజన సం ఘం ఆధ్వర్యంలో బుధేరా చౌరస్తాలో జగ్జీవన్రామ్ చిత్రపాటనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగ్జీవన్రామ్ ఆశయాలను కొనసాగించేలా ముందుకు సాగాలన్నారు.
నారాయణఖేడ్, ఏప్రిల్ 5: ఖేడ్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం జగీజవన్రామ్ జయంతిని నిర్వహించారు. నాయకులు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఉప ప్రధానిగా సేవలందించిన జగ్జీవన్రామ్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పరమేశ్, నగేశ్, లక్ష్మణ్రావు, ప్రభాకర్, సంగప్ప, సిద్దు, సురేశ్, రాజు, సంతోష్, శ్రీనివాస్రెడ్డి, దస్తగిర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.