పటాన్చెరు, డిసెంబర్ 9: దేశ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహి పాల్రెడ్డి అన్నారు. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకుని దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సామర్థ్యం సీఎం కేసీఆర్కే ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశరాజకీయాల్లో ప్రత్యామ్నాయశక్తి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి 14సంవత్సరాల పాటు సుధీర్ఘ పోరా టం చేసిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేస్తున్న నేత దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో పయనింపజేసే శక్తి ఉన్న నేత సీఎం కేసీఆర్. దేశంలో భారత రాష్ట్ర సమితి ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాం.
మత్స్యకారులకు అండగా ఉంటాం
పటాన్చెరు టౌన్, డిసెంబర్ 3 : మత్స్యకారులకు అండగా ఉంటామని పటాన్చెరు ఎ మ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో రూ. 20లక్షల సొంత నిధులతో ఎమ్మెల్యే మత్స్యకార భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ పటాన్చెరు నియోజక వర్గంలోని మత్స్యకారులకు ఆర్థిక అండ అందజేసేందుకు ఉచిత చేప పిల్లలను అందజేశామని గుర్తు చేశారు. రూ. 20లక్షల సొంత నిధులతో పట్టణంలో తిమ్మక్క చెరువు కట్టపై దుకాణాల సముదాయం, సామాజిక భవన నిర్మాణం జరుపుతున్నామన్నారు.
ముఖ్యమంత్రి మత్స్యకారుల కోసం నీలి విప్లవం సృ ష్టించారన్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవనంలో రెండు దు కాణా లు, స్టోరేజీ సౌక ర్యం కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మత్స్యకారులు ఆర్థిక భరోసా కల్పించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, పట్టణ ప్రముఖులు నివర్తిదేవ్, తులసిదాస్ పాల్గొన్నారు.