నర్సాపూర్, మార్చి7 : నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్టీ కళాశాలలో జాతీయ స్థాయి విద్యుత్ వాహనాల పోటీలు(బాజా సైండియా-2024) గురువారం రెండో రోజు జరిగాయి. ప్రిన్సిపాల్ సంజయ్దూబే మాట్లాడుతూ.. రెండో రోజు విద్యుత్ వాహనాల పోటీలో ప్రతి వెహికల్కి బ్రేక్ పరీక్షలు, సాంకేతిక మూల్యాంకనం, షాక్ అబ్జార్వర్స్ పరీక్షలు, డైనమిక్ సంఘటనలు, ధ్రువీకరణ ఈవెంట్, ఫైనాన్స్, డిజైన్ ఈవెంట్ ఫైనల్స్, ఇన్నోవేషన్స్, ద్రోణాచార్య కార్యక్రమం తదితర జరిగాయని వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీ రిలేషన్స్ సతీష్చంద్ర, పరుచూరి, మనోనీత్ కుమార్, విష్ణు మోటర్ స్పోర్ట్స్ మేనేజర్ కాంతారావు, డీజీఎం, అన్ని శాఖల విభాగాల అధిపతులు, మేనేజర్లు బాపిరాజు, అశోక్రెడ్డి, సురేశ్, నిర్వాహకులు పాల్గొన్నారు.