మద్దూరు(ధూళిమిట్ట), మార్చి18: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రానికి చెందిన కోడూరు మహ్మద్ అజార్ హుస్సేన్ జాతీయస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ఉమ్మడి మెదక్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల విజయ్బాబు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 నుంచి 27వరకు మధ్యప్రదేశ్లో జరిగే జాతీయస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొననున్నట్లు తెలిపారు. అజార్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై సిద్దిపేట జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కందుకూరి ఉపేందర్, దామెర మల్లేశ, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.