సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 14 : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులతో కలిసి బుధవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భద్రతా మాసోత్సవాలను ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లో మార్పు వచ్చినప్పు డే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, అందుకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన అవసరమన్నారు. ఇష్టారీతిగా వాహనాలను పార్కింగ్ చేయొద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, ఎంవీఐ జనార్దన్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 14 : ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై షేక్ యూనూస్ అహ్మద్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా ధూళిమిట్ట మండ లం బెక్కల్, బైరాన్పల్లి గ్రామాల్లో ట్రాక్టర్ ఓనర్స్, డైవర్లకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేకపోతే సీజ్ చేయనున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపకూడదన్నారు.
మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), ఫిబ్రవరి 14 : వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని భూంపల్లి ఎస్సై భూవనేశ్వర్రావు అన్నారు. బుధవారం అక్బర్పేట-భూంపల్లి చౌరస్తాలో పోలీసులు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడిపారు.
గజ్వేల్, ఫిబ్రవరి 14 : వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సీఐ మురళి సూచించారు. బుధవారం ప్రజ్ఞాఫూర్ సెయింట్ మేరీస్ విద్యానికేతన్ పాఠశాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ట్రాఫిక్పై నిబంధనల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్నారు. పట్టణంలోని జాలిగామ రోడ్డులో సీఐ బి.సైదా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హుస్నాబాద్, ఫిబ్రవరి 14: రోడ్డు భద్రతా నిబంధనలను డ్రైవర్లు విధిగా పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చాలని ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు, ఎస్సై తోట మహేశ్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డ్రైవర్లు, ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతివేగం ప్రమాదకరమన్నారు. మద్యం తాగి, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని చెప్పారు. వాహనదారులు రోడ్డుపైన వాహనాలను పార్కింగ్ చేయడంతో మిగతా వారికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ ప త్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.