మెదక్ రూరల్ , మార్చి 14: వస్తు వినిమయ వ్యవస్థలో వినియోగదారుడే రారాజు. వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారాన్ని పొందవచ్చు. ఎలాం టి రుసుం లేకుండా వినియోగదారుల ఫోరంలో కేసు లు వేయవచ్చు. ప్రతి వస్తువు, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. ప్రస్తు తం పాలు, నీళ్లలోనూ నాణ్యత లేకుండా పోతున్నది. తూకాల్లో భారీగా తేడాలుంటున్నాయి. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులు మేల్కొనాలి. తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలి. 1962న మార్చి 15 అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం అమల్లోకి వచ్చింది. నేడు అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం
వివిధ స్థాయిలో కమిషన్ల ఏర్పాటు
వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ స్థాయిలో కమిషన్లు ఏర్పాట్లు చేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల కమిషన్లు పనిచేస్తున్నాయి. ఫోరం స్థానంలోనే జిల్లా, జాతీయ వినియోగదారుల కమిషన్తు పని చేస్తున్నాయి.
నూతన చట్టంలోని అంశాలు
ఒక వస్తువు ఏ ప్రదేశంలో కొనుగోలు చేసినా, తాము నివాసముంటున్న న్యాయస్థానం పరిధిలో దాఖలు చేసుకోవచ్చు. జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఫిర్యాదుదారుడు, ప్రతివాదుల మధ్యవర్తిత్వం నడిపి వివాదాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తారు. జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు ను 45 రోజుల లోపల రాష్ట్ర కమిషన్కు అప్పీలు చేసుకోవచ్చు. జిల్లా కమిషన్ తీర్పును అనుసరించి వ్యాపా రి, విక్రయదారుల ఆస్తులను జప్తు చేసే అధికారం ఉంటుంది. ఫిర్యాదులను టైప్ లేదా రాత పూర్వకంగా దాఖలు చేస్తుకోవచ్చు. వస్తువులను అమ్మినవారు, డీల ర్, ఉత్పత్తిదారులు ఇందులో బాధ్యులవుతారు.
కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ…
జిల్లా, రాష్ట్ర,జాతీయస్థాయిలో వినియోగదారుల కమిషన్ తోడుగా కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ చట్టంలో ఉన్న ముఖ్యమైన భాగం. వీటికి ఆన్లైన్, ఈ మొయిల్ ద్వారా నేరుగా సంస్థలో ఫిర్యాదు చేసుకోవ చ్చు. ఇక్కడ పరిష్కరించిన కేసును జాతీయ కమిషన్ లో మాత్రమే అప్పీల్కు అవకాశం. జిల్లా, రాష్ట్ర, జాతీ య కమిషన్లతో సంబంధం లేకుండా సంస్థలో ఫిర్యాదుకు ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలో…
ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వినియోగదారులు వివాదాల పరిష్కార కమిషన్ కార్యాలయం సంగారెడ్డిలో ఉంది. 1889 అక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కమిషన్ చైర్పర్సన్గా పి.కస్తూరి, సభ్యులుగా, జి.వెంకటేశ్వర్లు, ఎం.విజయ్కుమార్ ఉన్నారు. 0845 5295654లో సంప్రదించవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా లో 1989 నుంచి వినియోగదారుల చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 3465 ఫిర్యాదుల్లో 3366 పరిష్కరించారు. 99 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2021లో 48 ఫిర్యాదుల్లో 46, 2022లో 86 ఫిర్యాదుల్లో 21, 2023 జనవరి నుంచి ఇప్పటి వరకు 16 కేసులు నమోదయ్యాయి.
బాధ్యతలు, పాటించాల్సిన జాగ్రత్తలు
ప్రతి వినియోగదారుడు వస్తువు నాణ్యమైనదా లేదా తెలుసుకుని కొనుగోలు చేయాలి. కొనే వస్తువు గురించి సమాచారాన్ని సేకరించాలి. అధీకృత డీలర్ల నుంచి మాత్రమే వస్తువు కొనాలి. ఈ క్రమంలో తయారీ తేదీలను గమనించాలి. కొనేటప్పుడు తప్పకుండా రసీదు అడిగి తీసుకోవాలి. వస్తువు విషయంలో గ్యారంటీ /వారంటీ కార్డును షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. ఇవి వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడుతాయి.
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
వినియోగదారులు నాసిరకం వస్తువులు, మోసపూరిత ప్రకటనలు, వ్యాపారులతో జాగ్రత్తగా ఉండా లి. నష్టం జరిగితే కమిషన్లో ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. ప్రతి ఒక్కరూ తమ హక్కులు తెలుసుకోవాలి. మోసపోతే కమిషన్ను ఆశ్రయించాడానికి వెనుకాడవద్దు. సలహాలు, సూచనలు, ఫిర్యాదులకు ఉమ్మడి మెదక్ జిల్లా వినియెగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కార్యాలయం సంగారెడ్డిలో ఉంది. 0845-5295654 నంబర్లో సంప్రదించవచ్చు. – పి.కస్తూరి, వినియోగదారుల కమిషన్ చైర్పర్సన్, సంగారెడ్డి
తప్పనిసరిగా బిల్లు, రసీదు తీసుకోవాలి
వినియోగదారుడు వస్తువులు కొనే ముందు ఆ వస్తువు నాణ్యతను పరిశీలించాలి. వస్తువు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు, బిల్లును అడిగి తీసుకోవాలి. వారం టీ కార్డును పొందాలి. మోసపోతే వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడతా యి. జిల్లాలో అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలు సలహాలు, సూచనలకు 9908948242 నంబర్లో సంప్రదించవచ్చు
– డాకూరి వెంకటేశం, వినియోగదారుల
సమాచార కేంద్రం జిల్లా కన్వీనర్, మెదక్