రామాయంపేట, ఏప్రిల్ 15 : పట్టణంలో అక్రమంగా ఇసుక డంపులు పెట్టి పాత వే బిల్లులను సృ ష్టించి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్న ఇసుక డంపులను రెవెన్యూ, మైనింగ్శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యుశాఖ డిప్యూటీ తహీసీల్దార్ స్వప్న, మైనింగ్ అధికారి దినేశ్ తెలిపిన వివరాలు.. రామాయంపేట పట్టణంలో కొన్నేండ్లుగా అక్రమంగా రోడ్లపై ఇసుక డంపులు ఏర్పాటు చేసి ఇసుక మాఫి యా యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నది.
విషయం తెలుసుకున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టణంలోని ఇసుక దందా నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, డంపుల యజమానులు హనుమాన్, సాయిరాం, ప్రకాశ్కు చెందిన సు మారు 576 టన్నుల ఇసుకతోపాటు ఒక లారీని స్వా ధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా పాత వే బిల్లులు సృష్టించిఇష్టారీతిన ఇసుకను విక్రయిస్తూ ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారని అధికారులు స్వప్న, దినేశ్ తెలిపారు. దీనిపై తహసీల్దార్ ఎండీ మన్నన్ను వివరణ కోరగా.. ఇసుక డంపులపై పూర్తి విచారణ జరిపి ఇసుకను వేలం వేస్తామన్నారు.