కొల్చారం, నవంబర్ 22: అటవీభూములను సాగు చేస్తున్న అందరికీ పోడు భూముల పట్టాలివ్వాలని సర్పంచ్ మంజులా సత్యనారాయణగౌడ్, ఎంపీటీసీ ఉదయ వేమారెడ్డి అన్నారు. మండలంలోని కొంగోడులో మంగళవారం సర్పంచ్ అధ్యక్షతన పోడు భూముల గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ అటవీభూముల హక్కు పత్రాల కోసం మొత్తం 154 మంది దరఖాస్తు చేసుకోగా, క్షేత్రస్థాయి సర్వేలో 58 మంది అర్హులుగా తేలారన్నారు. దీంతో పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వాలని రైతులు కోరారు.
అనంతరం ఎంపీడీవో ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకుంటే వారు ఇస్తారని సూచించారు. కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్నాయక్, గిర్దవర్ శ్రీహరి, ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ తుపాకుల మల్లేశం, ఫీల్డు అసిస్టెంట్ సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు. దామరంచ దేవదాస్ అనే రైతు జాబితాలో తన పేరు లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి హల్చల్ చేశాడు. అంతలోనే ఎస్సై శ్రీనివాస్గౌడ్ వచ్చి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని నచ్చజెప్పి వాటర్ ట్యాంకు దించారు.