జహీరాబాద్, డిసెంబర్ 29: మోతిమాతా జాతర నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. గురువారం మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లితండాలోని మోతిమాత దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జనవరి 5,6 తేదీల్లో జాతర నిర్వహించేందుకు దేవాలయం కమిటీ నిర్ణయించిందన్నా రు. జాతరకు మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరవుతారని తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పారిశు ధ్య పనులు చేసేందుకు మున్సిపల్, పంచాయతీ అధికారులు సమన్వ యం పని చేయాలన్నారు. పర్వాతపూ ర్ నుంచి జాతర వరకు రోడ్డుకు మరమ్మతులు చేయాలన్నారు. జాతరలో మద్యం అమ్మకాలు జరగకుండ తగు చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాజార్షి షా, వీరారెడ్డి, ఆర్డీవో రమేశ్బాబు, డీపీవో సురేశ్మోహన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు విజయ్మోహన్రెడ్డి, డీఎస్పీ రఘు, ఎంవీఐ జయప్రకాశ్రెడ్డి, ఫారెస్టు అధికారి రాధికారెడ్డి, గ్రామీణ నీటి సరఫరా అధికారి సాబేర్హుసేన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ డీఈఈలు ప్రవీణ్కుమార్, నర్సింహు లు, వైద్య అధికారి సీతారామారాజు, సీఐ తోట భూపతి, ఎస్ఐ. కాశీనాథ్, దేవాలయం కమిటీ సభ్యులు కిషన్రావుపవార్, శంకర్నాయక్. గోపాల్ ఉన్నారు.
ఎత్తిపోతల పనులు వేగవతం చేయాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్న సంగమేశ్వరా, బసవేశ్వర్ ఎత్తిపోతల పనులు చేసేందుకు భూసేకరణ చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. తహసీల్దార్లు భూసేకరణ చేసేందుకు సర్వే చేసి పను లు చేయాలన్నారు. ఝరాసంగం మండలంలో మచున్నూర్ శివారులో ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థలో పంచుతున్న మొక్కలను పరిశీలించారు.