సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 16: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మెదక్ పార్లమెంట్కు సంబంధించి 7 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. సంగారెడ్డి నియోజకవర్గానికి టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్చెరు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గానికి ఎమ్మోల్సీ యాదవరెడ్డి, మెదక్ నియోజకవర్గానికి డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, దుబ్బాక నియోజకవర్గానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మనోహర్రావు, గజ్వేల్ నియోజకవర్గానికి సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, సిద్దిపేట నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్ను నియమించారు.
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను కేటీఆర్ నియమించారు. జహీరాబాద్ నియోజకవర్గానికి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, ఆందోల్ నియోజకవర్గానికి డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, నారాయణఖేడ్ నియోజకవర్గానికి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, కామారెడ్డి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కార్పొరేషన్ మాజీ చైర్మన్ తిరుమల్రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గానికి దఫేదర్ రాజు, జుక్కల్ నియోజకవర్గానికి డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిని నియమించారు.