రామాయంపేట/ నర్సాపూర్రూరల్, మార్చి 1 : కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కుట్ర చేస్తు న్నదని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్త్తూ అంగన్వాడీ కార్యకర్తలు సీఐటీయూ అధ్వర్యంలో పోరుబాట పట్టారు. బుధవారం రామాయంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చేగుంట, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు రామాయంపేట పట్టణానికి చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించి, ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ.. మాత, శిశు సం రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న అంగన్వాడీ వర్కర్ల సమస్య లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కేంద్ర ప్రభు త్వం అంగన్వాడీ కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిపిట్స్తో పాటు పెన్సన్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. పనికి తగిన వేతనం ఇవ్వాలన్నారు. సీఐటీయూ దేశవ్యాప్త పిలుపు లో భాగంగా నిరసనలను చేపడున్నట్లు తెలిపారు. ఆం దోళన లో ఐదు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ను పూర్తిగా నిర్వీర్యం చేయాల ని కుట్ర చేస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. నర్సాపూర్ పట్టణంలో అంగన్వాడీ టీచ ర్లు, ఆయాలు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, మానవహారాన్ని చేపట్టారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలను ఉధృత్తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, అంగన్ వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ, కార్యదర్శులు విజయ, వరలక్ష్మి, ధనలక్ష్మి, సువర్ణ పాల్గొన్నారు.