దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు అమలు
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్ పట్టణంలోని 19 వార్డులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
మెదక్ మున్సిపాలిటీ, మే 15: అంబేద్కర్ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సా ధనకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివా రం మెదక్ జిల్లా కేంద్రంలో ని 19వ వార్డులో జ్యోతి అం బేద్కర్ యువజవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సామాజిక సంస్కరణవాది. ప్రజల మధ్య అంతరాలను చెరిపేసేందుకు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు పథకం తీసుకువచ్చి దళితులు బలోపతమయ్యేలా కృషి చేస్తున్నారన్నారు. విద్యతోనే సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చని సీం కేసీఆర్ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు.
త్వరలో అంబేద్కర్ కాంస్య విగ్రహం
మెదక్ జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీసు వద్ద గల చౌరస్తాలో త్వరలోనే అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోబోతున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వెల్లడించారు. చౌరస్తా పేరును సైతం అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం చేసుకుందామన్నారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేసుకొని అందులోనే అంబేద్కర్ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ సందర్భంగా ఇటీవల దళితరత్న పురస్కారాలు పొందిన టీజీవో నాయకులు జెల్ల సుధాకర్, జర్నలిస్ట్ నాయకులు బొందుగులు నాగరాజులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు జయరాజ్, మామిళ్ల అంజనేయులు, దయార లింగం, లక్ష్మీనారాయణగౌడ్, ఆర్కే శ్రీనివాస్, కిశోర్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ వెంకట నారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ మధుసూదన్రావు, ఎంఐఎం నాయకులు అంజాద్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, నాయకులు లింగారెడ్డి, దుర్గాప్రసాద్, గోదల సాయి, బోద్దుల కృష్ణ, కొండ శ్రీనివాస్, ఉమర్, నవీన్ జ్యోతి యువజన సంఘం అధ్యక్షుడు దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మించిన కిరాణా వర్తక సంఘం భవనాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, కౌన్సిలర్ రాగి వనజ, కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి తదితరులతో కలిసి ప్రారంభించారు.