న్యాల్కల్, మే 25 : నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయాధికారి లావణ్య సూచించారు. శనివారం మండలంలోని రేజింతల్, రాంతీర్ధం, తాట్పల్లి, టేకూర్, కల్బేమల్, అత్నూర్, హుమ్నపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వ్యవసాయాధికారులు నకలీ విత్తనాల పట్ల తీసుకునే జాగ్రత్తల గురించి రైతులకు అవగాహన కల్పించారు. సమావేశంలో ఏఈవోలు సాయిలు, షరీఫ్, హీనా, నిఖిత, అర్చ న, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
మనూరు, మే 25 : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల కేంద్రలోని ఫర్టిలైజర్తో పాటు రాయిపల్లి ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభు త్వం నుంచి గుర్తింపు పొందిన నాణ్యమైన పత్తి విత్తనాలు మాత్రమే రైతులకు అమ్మాలని ఫర్టిలైజర్ దుకాణాల యజమానులకు సూచించారు. ఫర్టిలైజర్ నిర్వాహకుడు మారుతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
హత్నూర, మే 25 : వానకాలం సీజన్లో రైతులు సాగుచేసే పత్తిపంట కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. హత్నూర మండలం పన్యాల, సాదుల్లానగర్ గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించి పత్తివిత్తనాలు కొనుగోలుచేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఏవో శ్రీనివాస్, ఏఈవో వరప్రతాప్ పాల్గొన్నారు.
ఝరాసంగం, మే 25 : నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి నష్ట పోవద్దని రైతులకు మండ ల వ్యవసాయ అధికారి వెంకటేశం సూచించారు. శనివారం మండల పరిధిలోని ఈదులపల్లి, తుమ్మాన్పల్లి, పోట్టిపల్లి, కృష్ణపూర్, ఏడాకులపల్లి గ్రామాల్లో విత్తనాల కొనుగోలుపై రైతులు, విత్తన డీలర్లకు అవగాహన క ల్పించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు సుకుమార్, హరికృష్ణ, వినోద్ కుమార, సంప త్, మండలంలోని డీలర్లు పాల్గొన్నారు.
నాగల్గిద్ద, మే25 : నాసీరకం విత్తనాలు, నకిలీ విత్తనాలు పంపిణీ చేస్తే డీలర్లపై చర్యలు తప్పవని వ్యవసాయ విస్తారణ అధికారి వెంకటేశం అన్నారు. శనివారం మండలంలోని రైతువేదికలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
కోహీర్, మే 25 : ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను రైతులకు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి నవీన్ కుమార్ హెచ్చరించారు. కోహీర్ పట్టణంలోని రైతు వేదికలో ఆయా గ్రామాల ఫర్టిలైజర్ దుకాణాల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమార్పీ ధరకే విక్రయించాలన్నా రు. నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. సమావేశంలో ఏఈవోలు శ్రీనివాస్, మౌనికవర్మ, సంధ్య, వేదవతి, సవిత, స్వాతిరెడ్డి, డీలర్లు పాల్గొన్నారు.
గుమ్మడిదల,మే 25 : విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు తగు జాగ్రతలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి రైతులకు అవగాహన సదస్సులో తెలిపారు. మండలంలోని కొత్తపల్లి, అన్నారం గ్రామాల్లో మండల వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కలిగించారు. కొత్తపల్లిలో మండలవ్యవసాయాధికారి శ్రీనివాస్రావు, ఏఈవో అస్మిత, అన్నారంలో ఏఈవో నిఖిత రైతులకు అవగాహన కలిగించారు.
వట్పల్లి, మే 25 : రైతులకు నాణ్యమైన విత్తనాలను మత్రమే విక్రయించాలని ఏడీఏ సత్యానారయణ ఫర్టిలైజర్ దుకాణ దారులకు వివరించారు. మండల పరిధిలోని ఫర్టిలైజర్ దుకాణలను తనిఖీ చేశారు. మండల వ్యవసాయ అధికారి మహేశ్ చౌహన్, ఏఈవోలు పాల్గొన్నారు.
అందోల్, మే 25 : రైతులు విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకొని అధికారుల సూచనల మేరకు పంటలను సాగుచేయాలని మండల వ్యవసాయ అధికారిణి విజయరత్న సూచించారు. మండలంలోని అన్నాసాగర్తో పాటు పలు గ్రామాల్లో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి విత్తనాల కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. ఏఈవోలు పాల్గొన్నారు.
సంగారెడ్డి, మే 25 : మండల పరిధిలోని కులబ్గూర గ్రామంలో విత్తనాల కొనుగోళ్లపై అన్నదాతలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా అధి కారి నర్సింహరావు మాట్లాడుతూ కొనుగోలుచేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.