సిద్దిపేట టౌన్, మార్చి 19 : ‘వ్యవస్థను కాపాడితే.. వ్యవస్థ మనల్ని కాపాడుతుంది.. న్యాయవ్యవస్థ జోడెడ్ల బండి లాంటిది.. కక్షిదారులకు సరైన సమయంలో న్యాయం అందించాలి’ అని హైకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేటకోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురామ్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఈ రోజు శుభ దినమని, గతేడాది రెవెన్యూ జిల్లాతో పా టుగా జ్యుడీషియల్ జిల్లాలుగా ఎస్టాబ్లిషన్ చేసుకున్నామన్నారు. అందులో భాగంగానే పది నెలల తర్వాత సిద్దిపేటలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యా యవాదులకు అభినందనలు తెలిపారు. అదనపు కోర్టుకు హైకోర్టు పూర్తిస్థాయిలో జ్యుడీషియల్ అధికారులను త్వరలో నియమిస్తున్నదని, అప్పటి వరకు అదనపు బాధ్యతలను ప్రసుతం ఉన్న అధికారులు చూసుకోవాలన్నారు. న్యాయవ్యవస్థ గడియారం లాంటిదని అన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచాలని సూచించారు. న్యాయవాదులు అనవసర వాదలకు వెళ్లకుండా కేసు పరిష్కారమయ్యేలా చూసి కక్షిదారులు ఉపశమనం పొందేలా చూడాలని సూచించారు.
అంతకుముం దు నూతనంగా ప్రారంభమైన అదనపు కోర్టులో మొదటి కేసును వాదించి ఇరువురి వాదనలను న్యాయమూర్తి విన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, అదనపు డీసీపీ (అడ్మిన్) మహేందర్, న్యాయమూర్తులు భవాని, స్వాతిరెడ్డి, సల్మాఫాతిమా, రమేశ్బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్రెడ్డి, న్యా యవాదులు హరిచంద్ర, హరిహరరావు, బాబూరావు, వెంకటలింగం, శివాజీ, రవీందర్, రాము లు, ప్రకాశ్, ప్రసాద్, భూంరెడ్డి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.