మెదక్ మున్సిపాలిటీ, జనవరి 24: సమాజంలో మ హిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను ధైర్యంగా ఎదుర్కొవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసిం గ్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకోని మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల పాఠశాలలో 6నుంచి 10వ తరగతి చదువుతున్న బాలికలకు నేటి నుంచి ఒక మాసం పాటు కరాటేలో శిక్షణనివ్వనున్నామని, ఇందుకోసం ప్రతి పాఠశాలకు రూ. 5వేల నిధులు మంజూరు చేస్తా మని తెలిపారు. స్వీయ రక్షణతో పాటు తోటి వారిని కాపాడాలంటే ప్రతి మహిళ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోవాలన్నారు. సమాజంలో ధైర్యంగా జీవించడానికి శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ప్రమాదాల సమయంలో సమ య స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. బాలికల, మహిళల రక్షణ భద్రతకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు అమలు చేస్తుందని, ప్రతి హక్కు, బాధ్యతలు తెలుసుకోవాలని సూచించారు. సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు విద్యావంతులైతే కుటుం బం, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి
ఆత్మరక్షణ కోసం విద్యార్థినులు కరాటే నేర్చుకోవాలని మెదక్ విద్యాధికారి రమేశ్కుమార్ అన్నారు. కరాటేతో ఆత్మస్తైర్యం పెరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటలపై శ్రద్ధ చూపేలా ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విలువలతో కూడిన వి ద్య అందిస్తున్నామని, స్వశక్తితో ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీలకంఠం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు. బాలికలు చేసిన కరాటే విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. పలువురు బాలికలకు బహుమతులు అందజేశారు.
– రమేశ్కుమార్, మెదక్ జిల్లా విద్యాధికారి